వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడొద్దు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడొద్దు

Published Sat, Jun 7 2014 1:38 AM

fight for solve problems to the public

 తోట చంద్రశేఖర్ సూచన
 
ఏలూరు (ఫైర్ స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ :
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితులలోనూ భయాందోళకు గురికావద్దని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పొరాడాలని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు తోట చంద్రశేఖర్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని శుక్రవారం ఏలూరుకు వచ్చిన ఆయనను పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన పార్టీని బలోపేతం చేసే అంశాలపై వారితో చర్చించారు. ఫలితాలను చూసి నిరాశచెందకుండా ప్రతి కార్యకర్త ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉందన్న విషయం మరువరాదన్నారు. టీడీపీ బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
ఈ హామీలను నెరవేర్చేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని సూచించారు. ఎక్కడైనా ఎటువంటి ప్రజావ్యతిరేక చర్యలను ఆ పార్టీ నాయకులు చేపట్టినా ప్రతిఘటించడంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. నాయకులు ఘంటా మురళీ, కొఠారు రామచంద్రారావు, ఊదరగొండి చంద్రమౌళి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement