కొత్తకొత్తూరు(నేలకొండపల్లి), న్యూస్లైన్: మండలంలోని కొత్తకొత్తూరులోని ఓ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ. 2లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తకొత్తూరులో మాదాసు శ్రీనివాసరావు హోటల్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10 గంటల వరకు హోటల్ నిర్వహించిన ఆయన ఇంటికి వెళ్లిపోయాడు.
ఆదివారం తెల్లవారుజామున ఆ హోటల్ నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు చూసి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు యత్నించాడు. అప్పటికే హోటల్లో ఉన్న రెండు ఫ్రిడ్జ్లు, కలర్ టీవీ, ఫ్యాన్, వంట సామగ్రి, ఫర్నిచర్, కేబుల్ టీవీ సామగ్రి, దుస్తులు పూర్తిగా కలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో కావాలనే హోటల్కు నిప్పు పెట్టారని పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేలకొండపల్లి ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, గ్రామ రెవెన్యూ అధికారి ఆలస్యం మధుసూధన్రావులు పంచనామా నిర్వహించారు. సంఘటన స్థలాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, సర్పంచ్ గుగులోత్ వీరమ్మ, వివిద సంఘాల నాయకులు పేరాల సత్యనారాయణ, గడ్డం సత్యం, కడియాల నరేష్, పావులూరి వెంకటేశ్వరరావు, పాగర్తి సుధాకర్, జె.సత్యనారాయణ, కోటారి ప్రసాద్ తదితరులు సందర్శంచి చర్యను తీవ్రంగా ఖండించారు. బాధితునికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
హోటల్లో అగ్నిప్రమాదం
Published Mon, Jan 27 2014 3:51 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి చర్యలు అనైతికం
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
14 నుంచి తిరుపతి గంగజాతర
ప్రజలకు ఏమి చేశారో చెప్పలేదు పవన్!
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
● చిత్తూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా భూకబ్జాలు ● సుమారు 250 ఎకరాలకు పైగా స్వాహా ● ఇప్పుడు తిరుపతిలో అక్రమాలకు సన్నాహాలు ● రూ.కోట్లు కూడబెట్టుకోవడమే అజెండా ● ఇద్దరు విశ్రాంత అధికారులతో పకడ్బందీ ప్రణాళిక ● తిరునగరిని దోచుకోవడమే లక్ష్యంగా అడుగులు
No Headline
పాలిసెట్ ఫలితాల్లో విశ్వం విజయకేతనం
ఫ్యాను హోరు
No Headline
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement