విజయవాడ: ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ విషయంలో రెండు ప్రభుత్వాలను సమన్వయం చేసుకుని ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీచేసిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన అనంతరం మంగళవారం రాత్రి 10 గంటలకు హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఆ నోటిఫికేషన్ కాపీలను హైదరాబాద్లోని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ అందజేశారు.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం, తిరుపతి ఎస్వీయూ, వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్లోని జేఎన్టీయూహెచ్, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Breadcrumb
2 రాష్ట్రాల్లో 5 కేంద్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్!
Published Thu, Aug 28 2014 2:36 AM
Related news
-
జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకోండి
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీదు సెల్లార్లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. ‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత,పూజారి సోమ్నాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు. -
రికార్డు స్థాయిల్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలకు చేరడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘అధిక వాల్యుయేషన్లు, ఎల్నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 – 21600 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచన, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు నేపథ్యంలో గతవారం సూచీలు 2.32% ర్యాలీ చేశాయి. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయం, యరోజోన్ నవంబర్ ద్రవ్యల్బోణ డేటా డిసెంబర్ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సలి్టంగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. జపాన్ నవంబర్ వాణిజ్య లోటు, బ్రిటన్ నవంబర్ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ అక్టోబర్ కరెంట్ ఖాతా, అమెరికా నవంబర్ గృహ అమ్మకాలు బుధవారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్ జీడీపీ డేటా గురువారం వెలువడుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ ద్రవ్యోల్బణం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల అవుతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించే వీలుంది. ప్రథమార్థంలో రూ.29,700 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీ బీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీప్ హెడ్ విజయకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 పబ్లిక్ ఇష్యూలు 8 లిస్టింగులు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు 12 కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెందినవి ఉన్నాయి. ముత్తూట్ మైక్రో ఫిన్, మోతీసన్స్ జ్యువెలర్స్, సురజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. హ్యాపి ఫోర్జ్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓలు డిసెంబర్ 19–21 మధ్య జరగునున్నాయి. అజాద్ ఇంజనీరింగ్స్ పబ్లిక్ ఇష్యూ 20–22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్ట్యాబ్ ఐపీఓ 21–26 తేదీల్లో జరగనుంది. ఎస్ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్టెక్స్, ఎలక్ట్రో ఫోర్స్, ట్రిడెంట్ టెక్ల్యాబ్లు కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. -
నితీశ్ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దమోహ్/గుణ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ‘ఉచిత రేషన్’ పొడిగింపుపై కాంగ్రెస్ అక్కసు పేదల ప్రజలకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు. తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. -
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు (కేఎస్బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
కుటుంబ పాలన.. ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. కర్తవ్యపథ్ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ను స్మరిస్తాయని, తాము గుజరాత్లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు. దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్గార్ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఈ నెల 9న జరిగే ‘క్విట్ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు. ‘అమృత్భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
Related News by category
-
ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజ గ్లాస్ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈసీకి వ్యతిరేకంగా జనసేన కోర్టుకు వెళ్లించింది. దీంతో, ఈ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది.ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది. -
ఒక్క హామీ నెరవేర్చలేదు..!
కదిరి: టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కదిరి ప్రాంతానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంతానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదిరి ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. కొన్నింటికి శిలాఫలకాలు కూడా వేశారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఆ శిలాఫలాకలు ఇప్పటికీ చంద్రన్నను వెక్కిరిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కదిరికి చేసిన మోసాలు, ద్రోహాలు కదిరి ప్రజలు గుర్తు చేస్తున్న వాటిలో మచ్చుకు కొన్ని.. 👉 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కదిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..‘కదిరి నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యరి్థని ఓడించారు. అయినా సరే కదిరి పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కదిరికి రింగ్రోడ్ మంజూరు చేస్తున్నా’ అని చెప్పారు. కానీ అమలు చేయలేదు.👉కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రింగ్రోడ్ తరహాలో కదిరికి రూ.234 కోట్లతో బైపాస్రోడ్డు మంజూరు చేసింది. ఈ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత ఆ మిగిలిన పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.👉తలుపుల మండల పరిధిలోని దాంపల్లి వద్ద చేపట్టిన హంద్రీనీవా మెయిన్ కెనాల్ సొరంగ మార్గం పనులు నా చేత కాదంటూ చంద్రబాబు చేతులెత్తేశారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనులను తిరిగి ప్రారంభించి దిగి్వజయంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఆ కాలువ ద్వారా నీరు పరవళ్లు తొక్కుతున్నాయి.👉 రాయలసీమను కరువు రక్కసి నుంచి కాపాడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఆనాడు వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్టును తెచ్చారు. ఇందులో భాగంగా కదిరి మండలంలోని చెర్లోపల్లి వద్ద రిజర్వాయర్ను ఏర్పాటు చేయించారు. వైఎస్ హయాంలోనే ఈ రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఆ మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి మరో పదేళ్లు పట్టింది. అయితే చంద్రబాబు తన స్వార్థం కోసం 2019 ఎన్నికలకు మునుపు సీఎం హోదాలోనే చెర్లోపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తి కదిరి ప్రాంత రైతులకు అన్యాయం చేసి కృష్ణాజలాలను తన సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించుకెళ్లారు.కదిరి ప్రాంత గిరిజనుల కోసం ‘బంజారా కమ్యూనిటీ భవనం’ నిర్మిస్తున్నామని 2014 జూలై 24న చంద్రబాబు సీఎం హోదాలో శిలాఫలకం వేశారు. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బంజారాల కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం అధికారికంగా అర ఎకరం స్థలం కేటాయించి నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరు చేసింది.కదిరి ప్రాంత పాత్రికేయుల కోసం రూ.5లక్షలతో ప్రెస్క్లబ్ భవనాన్ని నిర్మిస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. 2014 జూలై 25వ తేదీన శిలాఫలకాన్ని కూడా వేశారు. చివరకు ఆ హామీని కూడా నెరవేర్చలేక పోయారు. అప్పట్లో చంద్రబాబు వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ బాబును వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం బాబు హామీలు గుప్పిస్తుంటే జనం ‘నిన్ను నమ్మం బాబు’ అని అంటున్నారు. -
కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా.. కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరుందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2024 -
పెత్తందార్లకు గుత్తేదార్లు..
పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ డీబీటీ రూపంలో 50 నెలల్లో పేదల ఖాతాల్లో రూ.2,31,123.28 కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.2,33,915.92 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు రూ.4,65,039.20 కోట్ల లబ్ధి కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఈ రీతిన ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న పేదలను చూసి ఓర్చుకోలేక.. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దబాయించిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన తానా అంటే తందానా అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారంటూ తప్పుడు రాతలతో పుంఖానుపుంఖాలుగా కథనాలు అచ్చేసిన మీరు పెత్తందార్ల పక్షం కాదా రామోజీ?రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670.05 కోట్ల విలువైన ఇంటి స్థలాలను సీఎం వైఎస్ జగన్ పంపిణీ చేశారు. సెంటు భూమి శవాన్ని పూడ్చటానికి మాత్రమే సరిపోతుందంటూ పేదల సొంతింటి స్వప్నంపై అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా తాను పెత్తందారుడినని చంద్రబాబు చాటుకున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయనకు వంతపాడుతున్న మీది పెత్తందారీ పోకడ కాదా రామోజీ?నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెడితే.. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం కాదా? ఇందుకు మద్దతిస్తూ అక్షరోద్యమం నడిపిన మీరూ ఆ బాపతే కదా రామోజీ? అమరావతి రాజధాని ప్రాంతంలో 50 వేల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. దాన్ని నిరసిస్తూ హైకోర్టులో కేసులు వేయించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని వాదించేలా చక్రం తిప్పిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన్ను సమరి్థస్తూ వరుస కథనాలు వండివార్చిన మిమ్మల్ని పెత్తందారు అనక ఇంకేమనాలి రామోజీ? సీఎం వైఎస్ జగన్.. ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయ పడుతూ, వారి అభ్యున్నతి కోసం నాలుగేళ్లుగా పరితపిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆరి్థకంగా వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. అన్ని పదవుల్లోనూ సింహ భాగం కేటాయిస్తున్నారు. ఇది పెత్తందారీతనమా? లేక ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని చంద్రబాబు వారిని అవమానించడంపెత్తందారీతనమా? తేల్చి చెప్పే ధైర్యముందా రామోజీ? ‘ఈ రోజు రాష్ట్రంలో జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్.. పేదలు ఒక వైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్లు మరో వైపు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు’ అంటూ రాష్ట్రంలో చంద్రబాబు, ఎల్లో మీడియా పోకడలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం.. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాలను కట్టబెట్టడం.. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జాతీయ సంస్థల సర్వేలు నొక్కివక్కాణిస్తుండటం.. వీటన్నింటితో ఇక చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయమని మీరు తీవ్రంగా ఆందోళన చెందుతుండటం నిజం కాదా రామోజీ? విషం చిమ్ముతున్నది అందుకే కదా? మద్యం వ్యసనానికి దూరమవుతున్న పేదలు మద్యం ధరలు షాక్ కొట్టేలా చేస్తాం.. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేస్తాం.. అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు విస్పష్టంగా ప్రకటించారు. అదే విధానాన్ని సమర్థంగా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీరావుకు కంటగింపుగా మారింది. రాష్ట్రంలో 2014–19 మధ్య మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల ప్రైవేటు సిండికేట్ గుప్పిట్లో ఉండేవి. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ పేదలను కొల్లగొట్టేవారు. నిర్ణీత వేళలను పాటించకుండా విక్రయాలు సాగించేవి. ఇప్పుడు ఆ దందాకు చెక్ పెట్టారు. 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. గత సర్కార్ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యనుఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కొత్త బార్లకు లైసెన్స్లు ఇవ్వలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. తద్వారా పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోవడమే అందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్ కేసులు విక్రయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు, 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులు విక్రయించారు. అయినా సరే చంద్రబాబు కోసం ఈనాడు దు్రష్పచారం చేస్తోంది.సామాన్యునికి అందుబాటులో సినీ వినోదంటీడీపీ ప్రభుత్వ హయాంలో సినీ సిండికెట్ సినిమా టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. టికెట్ల గణాంకాలు ఎక్కడా ఉండేవి కావు. ఈ పరిస్థితిలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయాల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలను అందుబాటులోకి తీసుకువస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. అలా చేస్తే తమ దందాకు చెక్ పడుతుందని భావించిన టీడీపీ అనుకూల సిండికేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా మరోవైపు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల కేటగిరీల్లో సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ 2021 ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది.దీనిపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో హోమ్, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సినీ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ విధానాన్ని రూపొందించింది. ఆ మేరకు సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ 2022 మార్చి 7న జీవో 13 జారీ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలను తొలి వారం రోజులపాటు పెంచుకునేందుకు నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించింది. హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషకాలు కాకుండా సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటితే.. సినిమాలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తే... టికెట్ల ధరలను తొలి పది రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల యావత్ సినీ పరిశ్రమతోపాటు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై కూడా దిగజారుడు రాతలేనా రామోజీ? కార్పొరేట్కు కొమ్ము కాసింది బాబే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ వైద్య కళాశాలలకే పట్టంకట్టారు. టీడీపీ నాయకులు, సానుభూతిపరులకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చి.. వారి జేబులు నింపారు. ఇదంతా అప్పుడు రామోజీ కళ్లకు పచ్చగా కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడం కోసం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే.. దేశంలో ఎక్కడా లేనట్టుగా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి 2017 నుంచి రాజస్తాన్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.రాష్ట్రంలో పాత 12 వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు కొత్త విధానాన్ని అమలు చేయకుండా కేవలం కొత్తగా ఏర్పాటైన కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోగా.. మిగిలిన సీట్లలో 50 శాతం సీట్లను కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. మరో 50 శాతం సీట్లలో 35 శాతం ‘బీ’, 15 శాతం సీట్లను ‘సీ’ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. ఈ సీట్లకు ఫీజుల రూపంలో వచ్చే నిధులను ఆయా కళాశాలల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి కాబట్టే నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఏకంగా 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన సీట్లలో 50 శాతం రిజిర్వేషన్ వర్గాలకు కేటాయిస్తున్నారు. అంటే 300కు పైగా సీట్లు కన్వీనర్ కోటాలో ఈ ఏడాది నుంచి పెరిగాయి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మేలు చేయడం కాదా? నేతన్నకు తోడుగా.. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వరుసగా ఐదేళ్లు నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ వారి జీవితాలను మెరుగుపర్చుకున్నారు. నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచి్చంది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఈ మూడు పథకాలకు రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. చేనేత వ్రస్తాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.చేనేతకు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తూ ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ట్రైనింగ్ వంటి గట్టి ప్రయత్నాలతో చేనేత కుటుంబాలకు నైపుణ్యాన్ని మెరుగుపరిచే కృషి చేస్తోంది. శిక్షణతో వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్లు తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వస్త్రాలకు దీటుగా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్ కలి్పంచడం, ఆప్కో షోరూమ్లను విస్తరించి సొసైటీల వద్ద వ్రస్తాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఏపీ చేనేత వ్రస్తాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి(ఓడీఓపీ) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఏకంగా 36 చేనేత వ్రస్తాల ఉత్పత్తిని గుర్తించి వాటికి జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ సాధించేలా కృషి చేస్తోంది. ‘పచ్చ’పొరలు కమ్మిన మీకు ఇవేవి కని్పంచట్లేదా రామోజీ?నాడు చీకట్లు.. నేడు వెలుగులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలతో పాటు, ట్రూ అప్, ఎఫ్ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి వుండగా, 0–100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల విద్యుత్ సరీ్వసులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవారు. ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 0–200కు పెంచింది. దీంతో సర్వీసులు పెరిగాయి. సబ్సిడీ పెరిగింది. 2017–18లో సబ్సిడీ రూ.52.04 కోట్లు ఉండగా, 2022–23కి రూ.189.17 కోట్లకు పెరిగింది.ఇదంతా పేదలకు మేలు చేయడం కాదా రామోజీ? టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి దివాలా తీయించిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఏపీఈఆర్సీకి సమర్పించలేదు. దానికి తోడు డిస్కంలపై ఒత్తిడి తెచి్చ, 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేయించారు. పవన విద్యుత్ యూనిట్ రూ.2.44 ఉన్నప్పుడు రూ.5.94తో ఒప్పందం చేసుకున్నారు. సౌర విద్యుత్ యూనిట్ రూ 2.44కు లభిస్తుంటే (బ్యాక్డౌన్ చార్జీలతో కలిపి అయితే రూ. 3.54) రూ.8.09తో ఒప్పందాలపై సంతకాలు చేశారు. చంద్రబాబు హయాంలో స్లాబుల పేరుతో విద్యుత్ చార్జీల దోపిడీ జరిగేది. ఇవన్నీ మరచిపోయి ఎవరి కోసం విషం కక్కుతున్నారు రామోజీ?ఉన్నతంగా విదేశీ విద్య జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు.. నోబెల్ గ్రహీతలైన టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ వంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద గత ఏడాది 290, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబి్ధపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీ 64, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు 20, ఈబీసీలు 175 మందిఉన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్ సీజన్ కింద ఎంపికైన వారు 67 మంది ఉండగా, వీరిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒక్కరు, బీసీ 13, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు ఎనిమిది మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్కు చెందిన 290 మంది విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. ఆ తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకునే వారు కాదు. గత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునేందుకు 2014–19 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్ల వరకు వెచి్చస్తోంది.పైగా చంద్రబాబు 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను పెట్టారు. ఇప్పుడు నిధుల దురి్వనియోగానికి తావు లేకుండా విద్యార్థి సెమిస్టర్/టర్మ్ పత్రాలు సమరి్పంచగానే ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్ 50లో ఉన్న విద్యా సంస్థలను నిర్ణయించింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్న పరిమితిని తొలగించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పడం రామోజీకే చెల్లింది.ఇంటిపై హక్కులు కలి్పస్తే తప్పా? గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిరి్మంచుకున్న పేదలకు మేలు చేకూర్చేలా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది/రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు యాజమాన్య హక్కులు కలి్పంచింది. దీంతో 22–ఏ జాబితాలో ఉండే స్థలాలపై పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించాయి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఇళ్లలో నివసించే హక్కు స్థానంలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. స్వచ్ఛందంగా ముందుకు వచి్చన వారికి యాజమాన్య హక్కులను కల్పించారు.వన్టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను అమలు చేసి రుణాల నుంచి విముక్తి కలి్పంచాలని.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల నుంచి విజ్ఞప్తులు వచ్చినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వం పేదల మొర ఆలకించడం లేదంటూ రామోజీరావు ఒక్క రాత కూడా రాసిన పాపానపోలేదు. ఇప్పుడు పేదలపై మితిమీరిన భారం లేకుండా రూ.10వేలు, ఒక వేళ అంతకంటే తక్కువ రుణం ఉంటే అదే మొత్తం చెల్లించిన వారికి, రుణాలు తీసుకోని వారికైతే రూ.10 వంటి నామ మాత్రపు ఫీజులతో ఇళ్లపై యాజమాన్య హక్కులు కలి్పంచారు. రిజి్రస్టేషన్ ఫీజులను మినహాయించారు. ఇది పేదలకు మేలు చేయడం కాదా?ఓట్ల కోసం చంద్రబాబు డ్రామా బాబు హయాంలో 2014 జూన్ నుంచి 2016 అక్టోబర్ వరకు కందిపప్పు పంపిణీయే లేదు. 2016 నవంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికలు దగ్గరపడడంతో 2018 మార్చి నుంచి కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేశారు. మార్కెట్ ఒడిదుడు కులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 నుంచి రూ.160కు చేరింది.ప్రభుత్వం రూ.120కి పైగా కంది పప్పు ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే ఇచి్చంది. నెలకు రూ.56 కోట్లు సబ్సిడీ ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ధరలు పెరగడంతో నాఫెడ్ నుంచి కందులు కొనుగోలు చేసి వాటిని మర ఆడించి సబ్సిడీపై పంపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. సీఆర్ఎస్ కింద హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి తక్కువ ధరకు కందిపప్పు, బియ్యాన్ని విక్రయించే స్టాల్స్ ఏర్పాటు చేసింది. నాణ్యమైన పంచదారను సైతం అందిస్తోంది. అదే చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో సొంత కాంట్రాక్టుదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించి దోచుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. మున్సిపాల్టీల్లో ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని ఇస్తోంది. -
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement