నెల్లూరు (సెంట్రల్) :
కార్పొరేషన్ పరిధిలో రిలయన్స్ సంస్థ తమ కేబుల్ పనుల నిమిత్తం తీసిన గుంతలు పూడ్చేందుకు కార్పొరేషన్కు ఇచ్చిన రూ.5 కోట్లు ఏమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక రూరల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లోని పలువురు అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పించారు.
కొందరు అధికారుల అలసత్వం, అవినీతి వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. చిన్న పాటి వర్షం వచ్చినా ఈ గుంతలలో నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ సంస్థ తీసిన గోతులు పూర్తిస్థాయిలో మూసివేసి యథాస్థితికి తెచ్చేందుకు కార్పొరేషన్కి రూ.4.96 కోట్లు ఇచ్చిందన్నారు. ఆ కోట్లు ఏమయ్యాయో తెలియదని, గుంతలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు.
రిలయన్స్ సంస్థ ఇచ్చిన నగదును ఏ పనులకు వాడారు.. ఎందుకు వాడారు.. ఒక పని కోసం ఇచ్చిన నగదును మరో పనికి వినియోగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగునా.. అనే విషయాలపై సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. కార్పొరేషన్కు ఐఏఎస్ అధికారి వచ్చారని, ఇక్కడి వ్యవహారాలపై దృష్టి సారించాలని కమిషనర్ను ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంటనే స్పందించాలని, గుంతలు పూడ్చేందుకు ఇచ్చిన నగదు ఏమయ్యాయో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిలయన్స్ తీసిన గుంతల పూడిక పనులు ప్రారంభించాలని కోరారు. లేకుంటే రిలయన్స్ సంస్థ చేస్తున్న కేబుల్ పనులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులు, నాయకుడు కొల్లి పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆ.. ఐదు కోట్లు ఏమయ్యాయ్?
Published Mon, Oct 27 2014 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement