మూడేళ్ల చిన్నారిని కాపాడిన ఐదేళ్ల బాలుడు | Sakshi
Sakshi News home page

మూడేళ్ల చిన్నారిని కాపాడిన ఐదేళ్ల బాలుడు

Published Fri, Nov 14 2014 5:45 AM

మూడేళ్ల చిన్నారిని కాపాడిన ఐదేళ్ల బాలుడు - Sakshi

అమరావతి: కళ్లముందే నీళ్లకుండీలోకి జారిన మూడేళ్ల పిల్లాడిని ఐదేళ్ల బాలుడు కాపాడిన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నారుు. అమరావతి మండలం వైకుంఠపురంలోని దళితవాడలోని మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు సమీపంలో నేలపై మూతలేని నీళ్లకుండీ ఉంది. కొందరు పిల్లలు దానిపైన కూర్చొని కాళ్లు లోపలపెట్టి ఆడుకుంటున్నారు.
 
  పిల్లలంతా అక్కడినుంచి వెళ్లిపోగా నండూరి జయపాల్, సుమలతల కుమారుడు నందు (3) నీళ్లలోకి జారిపోతుండటాన్ని నండూరి పరిశుద్ధం కుమారుడు జోసెఫ్ (5) గమనించాడు. వెంటనే నందు చేతిని బలంగా పట్టుకున్నాడు. తన బలం సరిపోకపోవడంతో గట్టిగా అరవగా అటు వెళ్తున్న మేకల భవాని అనే మహిళ వచ్చి నందును బయటకు తీసింది. ప్రమాదాన్ని పసిగట్టి కాళ్లను నేలకు, కుండీకి అదిమిపట్టి నందు మునిగిపోకుండా కాపాడిన జోసఫ్‌ను అందరూ అభినందించారు. అతడిని బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అభినందించనున్నట్లు ఆర్‌సీఎం ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement