అరకొర సిబ్బందితో పనులు
విచ్చలవిడిగా కల్తీ విక్రయాలు
జిల్లా అంతటా ఇదే పరిస్థితి
పట్టించుకోని అధికారులు
భూత్ బంగ్లాగా కార్యాలయం
పరిసరాలు కూడా శుభ్రం చేసుకోని సిబ్బంది
సుభాష్నగర్, న్యూస్లైన్:
ఆహార భద్రత శాఖకు జబ్బు చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఆహార భద్రతను గాలికొదిలేశారు. దీంతో కల్తీ నిత్యావసర వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అడపాదడపా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నా యి. ప్రజలు ప్రతి రోజూ వినియోగించే పప్పుధాన్యాలు, వంటనూనె, కారంపొడి, శుద్ధ జలం(తాగునీరు)లో అత్యధికంగా కల్తీ జరుగుతోంది. అధికారుల ఉదాసీన వైఖరితో వ్యాపారులు ప్రతి వస్తువును కలుషితం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వంటనూనెలు విడిగా విక్రయించరాదు. అయినప్పటికీ, నగరంలో చాలా చోట్ల వ్యాపారులు విడిగా నూనె ను విక్రయిస్తున్నారు. ఇందులో చాలా వరకు క ల్తీ జరుగుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధింత అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాల కు తావిస్తోంది.
సూచనలు బేఖాతరు
ఆహార భద్రత శాఖాధికారుల నుంచి తప్పనిసరిగా లెసైన్సులు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. ఆన్లైన్లో లెసైన్సులు తీసుకోవాలని నాలుగు నెలల క్రితం అధికారులు సూచించినప్పటికీ వ్యాపారుల నుంచి స్పందన లేదు. ఇప్పటి వరకు కేవలం 430 మంది వ్యాపారులు మాత్రమే లెసైన్సులు పొందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
కొరవడిన తనిఖీలు
జిల్లావ్యాప్తంగా నిత్యావసర వస్తువులలో కల్తీ జరుగుతోంది. వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని ఆహారభద్రత శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో వీరి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తనిఖీలు లేకపోవడం కూడా వారికి వరంగా మారుతోంది. తేలికగా వినియోగదారులను బోల్తాకొట్టిస్తున్నారు. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్రంగా సిబ్బంది కొరత
ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ఈ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ సాకుతో వీరు విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాలైన కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, అన్ని మండల కేంద్రాలలో వేల సంఖ్యలో నిత్యావసర వస్తువుల దుకాణాలు, వందల సంఖ్యలో వాటర్ప్లాంట్లు ఉన్నా యి. వీటిని తనిఖీ చేయాల్సిన ఆహారభద్రత శాఖ మంచం పట్టింది. ఈ శాఖలో ఒక జిల్లా అధికారి, ఒక సేఫ్టీ ఆఫీసర్ (ఇన్చార్జీ, ఆదిలాబాద్), ఒక కార్యాలయ ఉద్యోగి, మహిళ అటెండర్ మాత్రమే ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆహార భద్రత కార్యాలయం భూత్ బంగ్లాను తలపిస్తుంది. పరిసరా లు అపరిశుభ్రంగా ఉంటాయి. ఇది నగరంలోని సుభాష్నగర్లో ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదుకేసులు నమోదు చేస్తున్నాంనిత్యావసర వస్తువులలో కల్తీ జరుగుతున్న విషయం వాస్తవమే. వాటిని నియంత్రించేందుకు కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 80 కేసులు నమోదు చేశాం. 42 మంది వ్యాపారులకు జరిమానాలు విధించాం. ఏడాదికి రూ. 12 ల క్షల ఆదాయం ఉన్న వ్యాపారులు మాత్రమే మా శాఖ ద్వారా లెసైన్సులు తీసుకోవాలి. కేసులు నమోదు చేయాలని మాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలంటూ ఏమి లేవు.
- అమృతశ్రీ, జిల్లా ఆహారభద్రత అధికారి
ఏదీ ఆహార భద్రత?
Published Wed, Feb 26 2014 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement