నెల్లూరు సిటీ,న్యూస్లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ ఏడాది ఫిబ్రవరి 9న నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో టెట్, డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో ఉన్న 347 ఉపాధ్యాయ ఖాళీల కోసం 11,514 మంది పోటీ పడుతున్నారు. ఇందుకోసం ప్రాథమిక దశలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు పేపర్-1కు (ఎస్జీటీ) 1173 మంది, పేపర్-2కు (స్కూల్ అసిస్టెంట్) 10,229 మంది, రెండు పేపర్లూ రాసేందుకు 112 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఫిబ్రవరి 9న నిర్వహించే టెట్కు హాజరవుతారు. ఈ పరీక్షలో సాధించే ఉత్తీర్ణత, అర్హతలను బట్టి డీఎస్సీకి హాజరు కావాల్సి ఉంటుంది.
జిల్లాలో 268 ఎస్జీటీ ఖాళీలున్నాయి. వీటితోపాటు 9 పీఈటీ, 42 పండిట్, 28 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం 28 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 366 మంది పోటీ పడుతున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల భర్తీకి మాత్రం అంతగా పోటీ లేకపోవడంతో డీఎడ్ అభ్యర్థులు నూతనోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ఎస్జీటీ తత్సమానమైన పీఈటీ, పండిట్ పోస్టులు 319 ఉంటే కేవలం 1173 మంది మాత్రమే టెట్కు హాజరవుతున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో నిలువనున్నారు.
బీఈడీ అభ్యర్థులకు శాపం : గతంలో బీఈడీ అభ్యర్థులు సైతం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు దరఖాస్తు చేసుకుని ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేవారు. తాజాగా బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనతో బీఈడీ అభ్యర్థులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. గత ఏడాది వరకు డిగ్రీ పూర్తి చేసిన పలువురు బీఈడీ పూర్తి చేసేవారు. డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య స్వల్పంగానే ఉండేది. గత ఏడాది ప్రభుత్వం, న్యాయస్థానాలు వెలువరించిన తాజా నిర్ణయం డీఎడ్ అభ్యర్థులకు వరంగా పరిణమించించగా, బీఈడీ అభ్యర్థులకు శాపంగా మారింది.
టెట్కు గట్టి పోటీ
Published Sun, Jan 19 2014 5:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement