సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం(సీఎంవో) పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. కొంతకాలంగా సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా, రాజకీయ కార్యాలయంగా మారిపోయిందని.. దీన్ని సంస్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. సీఎంవో పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్ధిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. సీఎంవో పనితీరు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ప్రజల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్, ఏపీ బిజినెస్ రూల్స్కు సవరణలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సవరణలు సీఎంవోకు వర్తింపచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.
అనధికార నోట్స్ ధ్వంసం చేస్తున్నారు...
‘గతంలో నేను సీఎస్గా పనిచేశా. ఆ అనుభవంతో సీఎంవో పనితీరు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సీఎంకు వచ్చే ఫైళ్లను పరిష్కరించేందుకు ఏర్పాటైన ఓ చిన్న వ్యవస్థే సీఎంవో. ఆ తరువాత కాలంలో సీఎంవో విస్తృతి పెరిగి సమాంతర సచివాలయంగా మారిపోయింది. ఇందులో ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర సర్వీసుల్లోని అధికారులు, ఇతర కేడర్కు చెందిన అధికారులకు సైతం సీఎంవోలో స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, అదనపు కార్యదర్శి ఉన్నారు. ఈ హోదాల్లో వీరు సీఎంకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. వీటికి సంబంధించి సీఎంవో ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదు. దీనికి సంబంధించి ఫైళ్లపై ఈ అధికారుల సంతకాలు కూడా ఉండటం లేదు. ఈ అధికారులు తమ సౌకర్యాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అనధికార నోట్స్ తయారు చేసి తరువాత ధ్వంసం చేస్తుంటారు.
సీఎంవో అధికారులు అనుసరించేందుకు నిర్ధిష్ట విధానం అంటూ ఏదీ లేదు. తమకు ఎటువంటి బాధ్యత లేదనట్లే వ్యవహరిస్తారు. ఇది ప్రజాప్రయోజనాలకు విరుద్ధం. సీఎంవో పనితీరును నియంత్రించే ఎలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లే అంతా ఇష్టానుసారం జరుగుతూ వస్తోంది. ఫైలు సిద్ధం చేసిన అధికారిపైనే దానికి సంబంధించిన బాధ్యత అంతా ఉంటుంది. ఈ మ్యాన్యువల్ను సీఎంవోకు వర్తింప చేస్తే అక్కడ పనిచేసే అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సచివాలయ నిర్వచన పరిధిలో సీఎం కార్యదర్శి లేరని చెబుతూ సీఎంవోకు సెక్రటేరియట్ మ్యాన్యువల్ను వర్తింప చేయడం లేదు. సీఎంవో పనితీరును తెలుసుకునేందుకు ఈ ఏడాది జూలై 17న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి ఓ ఫైల్ కాపీ ఇవ్వాలని కోరితే ఎలాంటి స్పందన లేదు. దీన్ని బట్టి అక్కడ ఫైళ్లకు సంబంధించిన రికార్డులను నిర్వహించడం లేదని అర్థమవుతోంది’ అని ఐవైఆర్ పేర్కొన్నారు.
ప్రధాని, గవర్నర్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు..
‘గవర్నర్ కార్యాలయానికి సెక్రటేరియట్ మ్యాన్యువల్ వర్తించనప్పటికీ అక్కడి అధికారులు మాత్రం రికార్డులను చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఫైలుపై అక్కడి అధికారుల సంతకం ఉంది. ఈ విషయం కూడా నాకు స.హ దరఖాస్తు ద్వారా తెలిసింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో కూడా రికార్డులను నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల మొదలు పీఎంవో వరకు రికార్డులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బాధ్యత లేని అపరిమిత అధికారం వల్ల వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఇక్కడ రహస్యమనే మాటకే తావులేదు. కేవలం అధికారం మీద మాత్రమే దృష్టి సారించడం వల్ల సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా మారింది. కొంత కాలంగా సీఎంవో ఓ రాజకీయ కార్యాలయంగా మారిపోయింది.’ అని కృష్ణారావు తన పిటిషన్లో వివరించారు. దీనిపై జోక్యం చేసుకుని నిర్ధిష్ట విధానం ప్రకారం సీఎంవో పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
రాజ్యాంగేతర శక్తిగా ‘సీఎంవో’
Published Tue, Oct 24 2017 3:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలి
పోస్టల్ బ్యాలెట్కు నేడూ అవకాశం
అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా
No Headline
రైతుబజార్ను మరింత అభివృద్ధి చేస్తా
ఉదయగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్
టీడీపీ అభ్యర్థి నారాయణను నమ్మొద్దు
బాబుకు ఓట్లేస్తే జన్మభూమి కమిటీలదే పెత్తనం
టీడీపీకి ఓట్లేస్తే సంక్షేమ పథకాలు రద్దే..
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement