Sakshi News home page

'ప్రభుత్వ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు'

Published Tue, Jul 21 2015 6:47 PM

Former Minister Peddireddy Ramachandra Reddy visits Tirumala

తిరుమల : రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఆచరణలో పెట్టడంలో విఫలమైందన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో అనంతపురం జిల్లా ప్రజలు బాగా ఆదరించారని, అయినప్పటికీ ఆ పార్టీ వారిని దగా చేస్తూ ఆత్మహత్యలకు కారణమైందన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల రైతుల్లోనూ, మహిళల్లోనూ, నిరుద్యోగుల్లోనూ నైరాశ్యం ఆవహించిందన్నారు. వారి పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండోసారి రైతు భరోసా యాత్ర ప్రారంభించారన్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాతోపాటు అన్ని జిల్లాల్లోనూ రైతులు, మహిళలు, అన్ని వర్గాల వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టనున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement