వైఎస్సార్సీపీలోకి రాజోలు మాజీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీలోకి రాజోలు మాజీ ఎమ్మెల్యే

Published Tue, Oct 1 2013 2:09 AM

వైఎస్సార్సీపీలోకి రాజోలు మాజీ ఎమ్మెల్యే - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్న అనంతరం పార్టీలో చేరారు. అలాగే, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దౌలతాపురం ప్రభాకర్, దశరథ్‌రెడ్డి, శంకర్‌లు కూడా జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో పామిడి వీరాంజనేయులు, సీహెచ్ దిలీప్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement