గుంటూరులో మాజీ రాష్ట్రపతి కలాం.. | Sakshi
Sakshi News home page

గుంటూరులో మాజీ రాష్ట్రపతి కలాం..

Published Sun, Mar 15 2015 11:38 AM

former president of india in gunturu for a private programe

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.. రమేశ్ కార్డియాలజి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం గుంటూరు వచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వమే చేయాలనే ఆలోచన నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులు మరిన్ని రావాలని.. ప్రభుత్వ భాగస్వామ్యంతో అవి మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు. విజయవాడ, గుంటూరులో డ్రైనేజి నిర్మాణం, తాగునీటి అవసరాలకోసం రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement