‘మీ ఇంటికి మీ భూమి’లో రైతులకు ఇవ్వని వన్బీ పత్రాలు
తప్పొప్పులు సవరించని గ్రామ సభలెందుకంటూ రైతుల మండిపాటు
రెండో విడత ఇంకా అప్లోడ్ కాని వైనం
ప్రత్యేక కార్యక్రమాల్లోనూ తాజా పర్చని రికార్డులు
విజయనగరం కంటోన్మెంట్:గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన వర్రి మల్లయ్య.. చనిపోయిన తన తండ్రి పాపునాయుడి పేరిట ఉన్న నాలుగున్నర ఎకరాల భూముల బదులు వన్బీలో 2.64 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే భూములను వారి ఇద్దరి అన్నదమ్ముల పేరున నమోదు చేయాలని పలుమార్లు రెవెన్యూ సిబ్బందికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెండో విడత ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమంలో మరోసారి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ‘మీ సేవ’కు వెళ్లాలని అధికారులు తాపీగా సూచించారు.
ఇదే గ్రామానికి చెందిన బర్ల జగన్నాథం, శ్రీరాములు, చంద్రుడు అనే అన్నదమ్ములు వారసత్వ భూములను పంచుకున్నారు. అయితే వారు చెప్పినట్లు కాకుండా రెవెన్యూ అధికారులు తమకు తోచిన విధంగా ప్రతి సర్వే నెంబర్నూ మూడు భాగాలు చేసి పట్టా పుస్తకాలు ఇచ్చేశారు. ‘మేం పంచుకున్నదొకలా...మీరు పంచినదొకలా’ఉందని, సమస్య పరిష్కరించాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ జరగలేదు.
గ్రామ రెవెన్యూ అధికారి అంటే ఆ గ్రామంలోని భూ రికార్డులను ఏటా తాజా పర్చడం, కొత్తగా వచ్చిన విధానాలకు రైతుల రికార్డులు అన్వయించడం చేయాలి. ప్రస్తుతం ఆన్లైన్ చేయడానికి రైతుల వద్ద పేరుకుపోయిన సమస్యలను తీర్చాలి. వీఆర్వో కాకుంటే ఆర్ఐ, తహశీల్దార్.. ఇలా మండల రెవెన్యూ అధికారులంతా భూ రికార్డులను తాజా పర్చడానికి కృషి చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో దశాబ్దాల నాటి రికార్డులు తప్పొప్పులతో నిండి ఉన్నాయి. వాటిని అధికారులు ఎప్పుడూ పరిష్కరించే ప్రయత్నం చేయలేదు.
‘మీ ఇంటికి..’ తీసుకొచ్చినా..!
ప్రభుత్వం కొత్తగా ‘మీ ఇంటికి మీ భూమి’ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా దానికి ప్రత్యేక యాప్ను కూడా రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా రైతుల రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాదే మొదటి విడత ‘మీ ఇంటికి-మీ భూమి’ గ్రామ సభలను నిర్వహించింది. ముందుగా రైతులందరికీ ప్రస్తుతమున్న రికార్డుల పరంగా ప్రింట్లు తీసి ఇస్తాం.. అందులో తప్పొప్పులను గుర్తించి అదే ఫారంలో పొందుపరిచి సంతకం చేసి ఇవ్వాలని, వాటిని ఆన్లైన్లో సవరించి రెండో విడతలో ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో రైతులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ఇన్నాళ్లకు పరిష్కారమవుతున్నాయనుకున్నారు. కానీ ఇదంతా ఒట్టిదేనని కొద్దిరోజులకే తేలిపోయింది. అధికారులు చెప్పిన విధంగానే రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో 1,11,538 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వాటిని తీసుకువెళ్లిపోయారు. ఇక తమ పని ముగిసినట్టేనని భావించారు.
మొదటికే దిక్కు లేదు..
రెండో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి అధికారులు వచ్చి సరిదిద్దిన వన్బీలు ఇస్తారని భావించిన రైతులకు అడియాసే అయింది. ఇప్పటికీ మొదటి విడత సభల్లో దరఖాస్తు చేసుకున్న సమస్యలు పరిష్కారం కాలేదు. ఆన్లైన్లో కూడా మార్పు చేర్పులు చోటు చేసుకోలేదు. మళ్లీ రెండో విడతలో కూడా దరఖాస్తులే స్వీకరిస్తామన్నారు. దీంతో రైతులు అవాక్కయ్యారు. మొదట వచ్చి వన్బీ ఫారాలు ఇచ్చి తప్పొప్పులను సరిదిద్దేందుకు అవకాశం ఇస్తామని చెప్పిన అధికారులు అలా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి నిత్యం రెవెన్యూ అధికారులు చేయాల్సిన విధులు చేయకపోగా ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకని రైతాంగం ప్రశ్నిస్తోంది.
‘మీ ఇంటికి..’ వచ్చినా ఫలితం లేదు!
Published Sat, Nov 21 2015 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement