వెయ్యితో పాటు మరో 200 గజాలివ్వండి | Sakshi
Sakshi News home page

వెయ్యితో పాటు మరో 200 గజాలివ్వండి

Published Thu, Feb 26 2015 4:35 PM

formers seek aditional develeped land

ఏపీ రాష్ట్ర రాజధాని నగరం నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నా, సర్కారు మాత్రం తన ప్రయత్నాలు ఇంకా మానలేదు. తాజాగా మరోసారి రాజధాని ప్రాంత రైతులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎకరం పొలానికి అభివృద్ధి చేసిన భూమి వెయ్యి గజాలతోపాటు మరో 200 గజాలు అదనంగా ఇవ్వాలని చంద్రబాబును రైతులు కోరారు. 200 గజాలు కుదరని పక్షంలో కనీసం 100 గజాలైనా ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం చెబుతామని ఆయన బదులిచ్చారు.

Advertisement
Advertisement