ఏపీ రాష్ట్ర రాజధాని నగరం నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నా, సర్కారు మాత్రం తన ప్రయత్నాలు ఇంకా మానలేదు. తాజాగా మరోసారి రాజధాని ప్రాంత రైతులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎకరం పొలానికి అభివృద్ధి చేసిన భూమి వెయ్యి గజాలతోపాటు మరో 200 గజాలు అదనంగా ఇవ్వాలని చంద్రబాబును రైతులు కోరారు. 200 గజాలు కుదరని పక్షంలో కనీసం 100 గజాలైనా ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం చెబుతామని ఆయన బదులిచ్చారు.