ఆటవిడుపు ఉత్సాహం విషాదాన్ని మిగిల్చింది
విధి ఆడిన ‘ఆట’ పసివారి ఉసురు తీసింది
అప్పటిదాకా ఆటపాటలతో ముంగిట సందడి చేసిన బుడుగులు
ఇక కనబడరని..ఆ నవ్వులు ఇక వినబడవని
తెలిసిన అమ్మమ్మ గుండె..ఒక్కసారిగా ఆగిపోయింది
ఆ ఇంట ఆనందాల హరివిల్లు చెదిరిపోయింది
పిలుపుకందని బిడ్డలను చూసిన తల్లిగుండె మంటలు చూశాక..
నీటితో కూడా నిప్పును రాజేయొచ్చని ఇప్పుడేగా తెలిసింది.
చీరాల, వేటపాలెం: గంగపుత్రులతో విధిఆడిన ఆట రెండు మత్స్యకార కుటుంబాల్లో విషాదం నింపింది. ఉప్పువాగు కాలనాగై నలుగురు చిన్నారులను మింగేసింది. పసివారి ఆటలు, మాటలతో మురిసిపోయే అమ్మమ్మ గుండె ఇక వారు రారని తెలిసి ఆగిపోయింది. దీంతో ఆదివారం ఆ అన్నదమ్ముల కుటుంబంలో అమావాస్య చీకట్లు కమ్మాయి. తీరప్రాంతం విషాదఘోషతో నిండిపోయింది. వేటపాలెం మండలం రామాపురానికి చెందిన వాయిల ఆంజనేయులు, శ్రీను అన్నదమ్ములు. వీరికి వేటే జీవనాధారం.
భార్యా పిల్లలను వదిలి నాలుగు రోజుల క్రితం అన్నదమ్ములు ఇద్దరూ కర్ణాటకలోని మంగుళూరుకు వేటకెళ్లారు. వాయిల ఆంజనేయులుకు భార్య మంగమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె అంజమ్మ (11), కుమారుడు రాముడు (8), మరో కుమార్తె సుజాత (7) చీరాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. అలానే ఆంజనేయులు సోదరుడు శ్రీను, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీను కొడుకు నాగరాజుతో పాటు ఆంజనేయులు ముగ్గురు పిల్లలు గ్రామం పక్కనే ఉన్న ఉప్పువాగులో నాటుతెప్పకు ఉపయోగించే బొందుపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురూ మునిగిపోయారు. ఘటనను గమనించిన స్థానికులు చిన్నారులను బయటకు తీసేలోపే వారు మృత్యువాత పడ్డారు.
ఆ తల్లికి తీరని గర్భశోకం..
గంగమ్మ తల్లిని నమ్ముకున్న తమ ఇంటి దీపాలను ఆ గంగమ్మే ఆర్పేస్తుందని ఊహించలేదని ముగ్గురు బిడ్డలను కోల్పోయిన మంగమ్మ కన్నీరు మున్నీరవుతోంది. తాము పడుతున్న కష్టాలు తమ బిడ్డలు పడకూడదని..చక్కగా చదువుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. ఆ ఇంట నవ్వులు, ఆనందాలు ఆవిరయ్యాయి. ఒకే కుటుంబం లో ముగ్గురు చిన్నారులు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వృద్ధురాలు మృతిచెందడం తో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
అప్పుడే నూరేళ్లు నిండాయా..బిడ్డా..
వాయిల శ్రీను కుటుంబంలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నాగరాజు ఆడుకుంటానని వెళ్లి..తిరిగిరాని లోకాలకు మరలిపోవడంతో తల్లి నాగమణి జీర్ణించుకోలేకపోతోంది. పదేళ్లు నిండకుండానే అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా బిడ్డా.. అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
ఆ నవ్వులు వినలేనని..
అల్లరిని చూడలేనని
ఆగిన అమ్మమ్మ గుండె
ఆటపాటలతో ఇల్లంతా సందడి చేస్తూ గారాలు పోయే పిల్లల అల్లరిని ఆస్వాదించేది అమ్మమ్మ నాగమ్మ. ఇకపై తాను ఆ పసివారి అల్లరిని, నవ్వులను చూడలేనన్న బాధతో నాగమ్మ(55) విలవిల్లాడింది. ఇంటి దీపాలు కొండెక్కడంతో.. ఇకతానెందుకు బతకాలో అర్థంకాక మలివయస్సులో ఆ వృద్ధురాలు గుండె ఆగి మరణించింది.
రాలిన పసిమొగ్గలు
Published Mon, Oct 20 2014 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement