అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి

Published Sat, Nov 9 2013 5:43 PM

Four Killed in Anantapur road accident

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్పల మండలం పప్పూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొన్నాయి.

ఈ సంఘటనలో నలుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement