హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ. 22.5 లక్షల వసూలు
కర్నూలు(ఓల్డ్సిటీ): హోంగార్డు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను వంచించారు. సాక్షాత్తు ఓ ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ, తన ఇద్దరు సహచరులతో వంచనకు పాల్పడ్డారు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ నియామక పత్రాలతో బోల్తా కొట్టించారు. ఎట్టకేలకు పోలీసులు ఈ వీరి అవినీతి బాగోతానికి తెరదించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఏపీఎస్పీ రెండో పటాలం ఆర్ఎస్ఐ బీ.కృష్ణుడు (56), ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన సందడి మధుసూదన్ (34), స్థానిక కృష్ణానగర్కు చెందిన దుంపల విశ్వనాథ్రెడ్డి (49) స్నేహితులు. వీరు మందు పార్టీలు చేసుకుంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనకు వ్యూహరచన చేశారు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకునేందుకు స్కెచ్ వేశారు.
సుమారు ఏడు నెలల క్రితం కర్నూలుకు చెందిన ఆకేపోగు సురేశ్ నుంచి రూ. 2.5 లక్షలు, వెలుగోడుకు చెందిన బాలచంద్రుడు నుంచి ముందస్తుగా రూ.50 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో వీరిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను సీసీఎస్కు బదలాయించగా, సీసీఎస్ పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు నిందితులను స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు.
మరో 17మంది బాధితులు : సీసీఎస్ పోలీసుల విచారణలో వీరి బాగోతాలు మరికొన్ని బట్టబయలయ్యాయి. ఫిర్యాదుదారులతో పాటు మరో 17 మంది నుంచి వీరు హోంగార్డు ఉద్యోగాల పేరిట మొత్తం రూ. 22.5 లక్షలు వసూలు చేశారు. ఒక బాధితుడు తులం బంగారు గొలుసు, పదవ తరగతి సర్టిఫికెట్లు ఇచ్చి మోసపోయాడు.
దళారులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ
హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి రూ. 20 లక్షల నగదు, ఒక బంగారు గొలుసు, నకిలీ నియామక పత్రం, అభ్యర్థుల పదో తరగతి సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ వెల్లడించారు.
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. వారికి త్వరలో రివార్డులు ప్రకటిస్తామన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, దళారులను నమ్మవద్దని నిరుద్యోగులకు సూచించారు. ప్రస్తుతం పటిష్టమైన రిక్రూట్మెంట్ విధానాలు ఉన్నాయన్నారు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బు డిమాండ్ చేస్తే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. సీఐ రవిబాబు, ఎస్ఐలు శ్రీహరి, అమీర్అలీ, నాయబ్ రసూల్, ఏఎస్ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుళ్లు విజయరాజు, మురళి, కానిస్టేబుళ్లు దేవరాజు, సుబ్బరాయుడు, హోంగార్డు రాములను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శివకోటి బాబూరావు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఘరానా మోసం!
Published Sat, Apr 18 2015 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement