{పత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి
ఏలూరు(ఆర్ఆర్ పేట) : రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రాకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, దానికి మద్దతు పలికిన టీడీపీ ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ సీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని, తాము అధికారంలోకి వస్తే కనీసం పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. అదే వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న ప్రభుత్వమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. గతంలో రామ మందిర నిర్మాణం విషయంలో బీజేపీ దేశ ప్రజలను మోసగించిందని, ఆ మోసాన్ని గ్రహించిన ఓటర్లు తరువాత ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దించేశారని గుర్తు చేశారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఆ పార్టీ మరోసారి అధికారం నుంచి దిగిపోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుబ్బారాయుడు హెచ్చరించారు.
విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రభుత్వాలు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసగించగా, ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆ హామీ నుంచి పలాయనం చిత్తగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో చూపిన ఉత్సాహాన్ని ప్రత్యేక హోదా అమలు చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు.
ప్రత్యేక హోదాపై పచ్చి మోసం
Published Sat, Aug 1 2015 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement