సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఆయన సోమవారం సాయంత్రం రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి క్వారీ మార్కెట్ సెంటర్లో జరిగే ‘వైఎస్సార్ జనభేరి’ సభలో పాల్గొంటారు.
రాజమండ్రి కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని అన్ని డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తలపడుతున్నారు. ఇప్పటికే మండపేటలో ఒకరు, అమలాపురంలో మరొకరు వైఎస్సార్ సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై విజయదుందుభి మోగించడంతో జిల్లా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని సుస్పష్టమవుతోంది. రాజమండ్రి సహా అన్ని చోట్లా గెలుపు బావుటా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన అనంతరం ఇతర పార్టీల అగ్రనాయకుల కన్నా ముందుగా జగన్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి రానుండడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మోముల్లో అప్పుడే విజయ దరహాసం చిగురిస్తోంది. మున్సిపోల్స్లో సాధించే విజయాల స్ఫూర్తితో ఆ వెంటనే జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ జయభేరి మోగిస్తామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గత నాలుగున్నరేళ్లుగా జగన్కు అండగా నిలిచిన జిల్లావాసులు ఈ కీలక సమయంలోనూ ఆయన వెంటే ఉంటారని, ప్రజాసమస్యలపై గత నాలుగేళ్లుగా అలుపెరగని పోరు సాగిస్తున్న ఆయన నాయకత్వాన్నే కోరుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు. ఆయన జిల్లాకు ఎప్పుడు వచ్చినా బ్రహ్మరథం పట్టడమే అందుకు తార్కాణమంటున్నారు. కాగా జిల్లాలో జగన్మోహన్రెడ్డి రోడ్ షోలు సాగే రూట్ మ్యాప్ను పార్టీ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదివారం అమలాపురంలో పరిశీలించారు.
నేటి నుంచి జగన్ ‘జనభేరి’
Published Mon, Mar 17 2014 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement