సాక్షి ప్రతినిధి, విజయనగరం : మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాల బలోపేతం కోసం 2000-2001లో ప్రపంచ బ్యాంకు సాయంతో కేంద్రప్రభుత్వం రూ. 30.7కోట్ల సామాజిక పెట్టుబడి నిధిని డీఆర్డీఏకు విడుదల చేసింది. వీటిని సాధారణ వడ్డీకి గ్రామైక్యసంఘాలకు రుణాలివ్వాలని, రుణం తీసుకున్న సంఘాలు తిరిగి 100 వాయిదాల్లో ప్రతీ నెలా మండల సమాఖ్యలకు వడ్డీతో కలిపి చెల్లించాలని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
దీనివల్ల స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా రుణాలపై వచ్చే వడ్డీతో మండల సమాఖ్యలు నిర్వహించుకోవాలన్నది లక్ష్యం. కానీ జిల్లాలో సామాజిక పెట్టుబడి నిధి లక్ష్యం నెరవేరలేదని తెలుస్తోంది. కొంత సొమ్మును వేరే అవసరాలకు సర్ధుబాటు చేయగా, మరికొంత సొమ్మును కొం దరు సిబ్బంది, అధ్యక్షులుగా చెప్పుకునే కొందరు కుమ్మక్కై స్వాహా చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
తేలని రికవరీ లెక్కలు
కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ. 30.7కోట్లు 1100గ్రామైక్య సంఘాలకు రుణాలుగా అందించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన కచ్చితమైన రికార్డుల్లేవు. ఇప్పటివరకు రూ. 6కోట్లవరకు రికవరీ జరిగినట్టు మాత్రమే చెబుతున్నారు. వడ్డీతో కలిపి ఇంకా రూ. 29.13కోట్ల మేరకు రావల్సి ఉందని చెబుతున్నారు. ఇందులోనూ వాస్తవాలు కనిపించడంలేదు. చాలా వరకు సంఘాలకు రుణం సొమ్ము వెళ్లకుండా మధ్యలోనే స్వాహా అయిపోయిందని, ఆ కారణంగానే ఇంతవరకు రికవరీ జరగలేదని తెలుస్తోంది. సంఘం సభ్యులకు తెలియకుండా అధ్యక్షులు, సిబ్బంది కుమ్మక్కై పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా గ్రామైక్య సంఘాలకు ఇచ్చినట్టయితే ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేవి. రికవరీ కన్పించేది. దీనికి సంబంధించి స్పష్టమైన లెక్కలు లేకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది.
వసూలైన రూ. 10కోట్లు వేరేవాటికి సర్దుబాటు
సక్రమంగా లావాదేవీలు జరిగిన సంఘాల నుంచి వసూలైన నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా వేరే అవసరాలకు సర్దుబాటు చేశారు. సుమారు రూ. 10కోట్ల వరకు స్వయం సహాయక సంఘాల సభ్యుల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద మళ్లించారు. వాస్తవానికైతే, స్వయం సహాయక సంఘాల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం వసూలు చేసి కట్టాలి.
కానీ, నాటి డీఆర్డీఏ అధికారులు గొప్పకు పోయి స్వయం సహాయక సంఘాల సభ్యులందరి నుంచి ప్రీమియం వసూలు చేసినట్టు చూపించి, సామాజిక పెట్టుబడి నిధి నుంచి రూ. 10కోట్లు వేరు చేసి కట్టేశారు. ఆ తర్వాత తీరికగా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంను చాలా వరకు సంఘాల సభ్యులనుంచి వసూలు చేసినట్టు తెలిసింది. కానీ, రికార్డుల్లో మాత్రం అదేదీ చూపించలేదు. ఆ ప్రీమియం ఇంకా వసూలు చేయాల్సి ఉందని సంబంధిత ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ వసూళ్లలోనూ స్వాహా జరిగిందన్న వాదనలు ఉన్నాయి. మొత్తమ్మీద మళ్లింపు, రుణబకాయిల కింద మండల సమాఖ్యలకు రావాల్సిన రూ. 30కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు.
ఆర్థిక వెతల్లో సమాఖ్యలు
అటు అసలు, ఇటు వడ్డీ రాకపోవడంతో మండల సమాఖ్యలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రతీ మండల సమాఖ్యలో ఒక అకౌంటెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. వారి జీతాలు, కార్యాలయ విద్యుత్బిల్లు మండల సమాఖ్యలే చెల్లించాలి. ఇలా ప్రతీ నెలా రూ. 20వేలకు పైబడి ఖర్చు ఉంటుంది. ఇదంతా సామాజిక పెట్టుబడి నిధి వడ్డీ నుంచే వెచ్చించాలి. గ్రామైక్య సంఘాల నుంచి రికవరీ లేకపోవడంతో ఇప్పుడా ఖర్చులు భరించలేని స్థితిలో మండల సమాఖ్యలున్నాయి.
నిధులు గోల్మాల్?
Published Sat, Jul 9 2016 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement