భవిష్యత్తు ఇంజినీరింగ్ విద్యార్థులదే | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు ఇంజినీరింగ్ విద్యార్థులదే

Published Mon, Sep 30 2013 11:43 PM

future is engineering students only

 పటాన్‌చెరు, న్యూస్‌లైన్: భవిష్యత్తులో ఇంజనీర్ విద్యార్థులకు పుష్కలమైన ఉద్యోగ అవకాశాలున్నాయని విప్రో సీనియర్ జనరల్ మేనేజర్ మురళి తెలిపారు. సోమవారం పటాన్‌చెరు శివార్లలోని ఎల్లంకి కళాశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ  ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నవారికి ఏమాత్రం ధోకా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులనుచూసి ఎవరూ ఆందోళన చెందాల్సినని లేదన్నారు. అన్ని విభాగాలలో కూడా భవిష్యత్తులో ఇంజినీర్లకు ఎన్నో అవకాశాలుంటాయని తెలిపారు.
 
   సాఫ్ట్‌వేర్‌తోపాటు అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయని వివరించారు. ఎల్లంకి కళాశాల డెరైక్టర్ సాంబశివరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ కళాశాలల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అలాగే కళాశాలలో లైబ్రరీని ఫిజికలైజేషన్ చేసినట్లు తెలిపారు.  ఈ ప్రత్యేక డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని విప్రో జనరల్ మేనేజర్ మురళి చేతుల మీదుగా ప్రారంభించారు.  కార్యక్రమంలో కళాశాల డెరైక్టర్ దయాకర్‌రెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు

Advertisement
Advertisement