సాక్షి, కడప/ కడప స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయంగా కొందరు, పైరవీలు చేస్తూ మరికొందరు సీటు కోసం చక్రం తిప్పుతున్నారు. ఏకంగా కేంద్ర మంత్రుల నుంచి ఫోన్లు వస్తుంటే ఒత్తిడి భరించలేక ఓ అధికారి నాలుగు రోజుల పాటు సెల్ఫోన్ ఆఫ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎలాగోలా సీటు దక్కించుకుంటే ఇంటర్ వరకు అన్ని ఖర్చులు పాఠశాల యాజమాన్యమే భరించడంతో పాటు క్రీడల్లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు భావిస్తుండటం వల్లే డిమాండ్ ఏర్పడింది.
సెలక్షన్స్పై ఉత్కంఠ
క్రీడా పాఠశాలకు ఎంపికైతే క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పడినట్లే. కడప నగరంలో ఉన్న వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 40 సీట్లు (బాలురు20, బాలికలు20) ఉంటాయి. తొలుత మండల, ఆపై జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వారిలోంచి అర్హులైన వారిని ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ఎంపిక చేస్తారు.
ఈ ఎంపికకు ఒక్కో జిల్లా నుంచి బాలికల విభాగంలో ఎనిమిది, బాలుర విభాగంలో ఎనిమిది.. మొత్తం 16 మంది హాజరు కానున్నారు. ఈ లెక్కన 13 జిల్లాల నుంచి 208 మంది బాలబాలికలు ఫైనల్ సెలక్షన్స్కు హాజరు కానున్నారు. వీరిలో ప్రతిభ కనపరిచిన 40 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. పోటీ ఎక్కువగా ఉండటంతో పలువురు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఓ కేంద్ర మంత్రి నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది.
ఎంపికలకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
గతేడాది సెలక్షన్స్లో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ ఏడాది అత్యున్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, మెంబర్ కన్వీనర్గా క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి యాదవ్, మెంబర్లుగా శాప్ ఎండీ రేఖారాణి, జిల్లా కలెక్టర్ కే.వి.రమణ, ఓఎస్డీ నాగరాజు, శాప్ డెరైక్టర్లు హనుమంతరావు, సత్తి గీత, రవీంద్రబాబు, డి.జయచంద్ర వ్యవహరిస్తారు. క్రీడా పాఠశాల కోచ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కోచ్లను ఈ ఎంపిక ప్రక్రియకు నియమించారు.
నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహిస్తాం
మాకు ఏ రాజకీయ నాయకుడు, ప్రజా ప్రతినిధి నుంచి ఎటువంటి ఒత్తిడి రాలేదు. క్రీడా పాఠశాల ఎంపికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం. శాప్ చైర్మన్, సభ్యులు, ఎండీ, జిల్లా కలెక్టర్ తదితరులతో కూడిన అత్యున్నత కమిటీ ఈ ఎంపికలను పర్యవేక్షిస్తుంది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు వదంతులు, దళారులను నమ్మవద్దు. ఈ నెల 27న రాయలసీమ జిల్లాల క్రీడాకారులకు, 28న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, 29న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల క్రీడాకారులకు ఫైనల్ సెలక్షన్స్ పోటీలు నిర్వహిస్తున్నాం.
- రుద్రమూర్తి యాదవ్, క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి, కడప
ఆట.. అడ్డదారి!
Published Sun, Jul 26 2015 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement