కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం

Published Thu, Sep 19 2013 12:52 PM

Ganesha idols immersed till second in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిన్న వేకువజామున మొదలైన గణనాధుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 30 వేల విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. అర్థరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల కాస్త ఆలస్యంగా, నెమ్మదిగా విగ్రహాలు ముందుకు కదులుతున్నాయి. ఇక ఖైరతాబాద్‌ మహా గణపతి మరికాసేపట్లో నిమజ్జనం అయ్యేందుకు సిద్ధమయ్యాడు. ట్యాంక్‌బండ్ వద్ద తుదిపూజలు అందుకున్నాడు. అయితే కార్యాలయం వేళలు కావడంతో ట్రాఫిక్‌కు పలుచోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రద్దీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement
Advertisement