అనంతపురం : ఉద్యోగాలు కల్పిస్తామంటూ పేపర్ ప్రకటన ఇచ్చి సుమారు 300ల మంది దగ్గర భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి చివరికి చేతులెత్తేసిన ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురం పట్టణంలోని హెచ్ఎల్ఎస్ కెనాల్ సమీపంలో కృష్ణ, ప్రసాద్రెడ్డి, సాధిక్ వలీ అనే ముగ్గురు కలసి కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ పేరుతో ఓ సంస్థను ఈ ఏడాది జనవరిలో ఏర్పాటు చేశారు. ఉద్యోగాల నియామకాల పేరుతో పేపర్ ప్రకటన ఇచ్చారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యాలయ ఉద్యోగాల పేరుతో 300 ల మందిని నియమించుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు దండుకున్నారు. కాగా ఎనిమిది నెలలు గడిచినా ఇంతవరకు జీతాలు ఇవ్వకపోయేసరికి బాధితులు గత మూడు రోజుల నుంచి సంస్థ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. దీంతో కృష్ణ, సాధిక్లు వారిపై పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితులను పోలీసులు విచారించడంతో నిర్వాహకుల మోసం బయటపడింది. దీంతో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కృష్ణ, సాధిక్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో భారీ మోసం
Published Fri, Sep 4 2015 7:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement