40 కిలోల గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

40 కిలోల గంజాయి స్వాధీనం

Published Fri, Feb 6 2015 12:39 PM

ganja worths rs 4 lakh seized

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రేలుగుంట సమీపంలో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా చేస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబందించిన ఒక ఆటోను సీజ్ చేశారు.

గంజాయి తరలిస్తున్నఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(రేలుగుంట)

Advertisement
Advertisement