గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన భూములు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో అభివృద్ధి అడుగు ముందుకు పడుతోంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ప్లాన్ రూపకల్పనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సన్నాహాలు చేస్తోంది. అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు బోయింగ్, కార్గో విమానాలు కూడా రాకపోకలు సాగించేలా రన్వే విస్తరించనున్నారు.
గన్నవరం : విజయవాడ సమీపంలో రాజధాని ప్రకటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్తో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
దీంతో విమానాశ్రయ అభివృద్ధికి ఏఏఐ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఉన్న సుమారు 500 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న 490 ఎకరాలు అప్పగిస్తే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు పేర్కొంటున్నారు. భూసేకరణ పూర్తయిన మూడేళ్లలోనే ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు ఏఏఐ కూడా సిద్ధంగా ఉంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో...
విమానాశ్రయ విస్తరణలో భాగంగా సుమారు 700 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూర్చునేందుగా వీలుగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ను నిర్మించడంతో పాటు భారీ బోయింగ్ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న 9,500 అడుగుల రన్వేను సుమారు 12,500 అడుగుల వరకు విస్తరించనున్నట్లు ఎయిర్పోర్టు డెరైక్టర్ రాజ్కిషోర్ ‘సాక్షి’కి తెలిపారు. కార్గో సర్వీసులు నడిపేందుకు అనువైన వసతులతో పాటు అప్రాన్, కార్ పార్కింగ్, ఏటీసీ టవర్ తదితర నూతన హంగులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జెట్ స్పీడ్ !
Published Wed, Nov 12 2014 12:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement