భీమవరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దళితులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ను, ఇతర సభ్యులను నియమించాలని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గంటా సుందరకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక 11వ వార్డులో బుధవారం నిర్వహించిన దళిత ఐక్య వేదిక భీమవరం శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా దళతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్ళు గడుస్తున్నా రాజ్యాంగ పరంగా దళితులకు హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయన్నారు. దళిత హక్కుల సాధనకోసం నేటీకీ పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా జిల్లాకు ఒక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలన్నారు. దళితుల సమస్యలపై మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, వివిధ ఆందోళనా కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గొల్లపల్లి మాణిక్యాలరావు, పాలపర్తి జోనా, యాళ్ళ ప్రసాద్కుమార్, పిల్లి మాణిక్యాలరావు, గోసాల కుమార్, కాటూరి విజయశేఖర్, దిడ్ల ఏసు, గూడపాటి యోహాన్, కె.రమేష్, బి.క్రాంతికుమార్, మోకా శాంతరాజు, కాటుక రమేష్, మద్దిరాల పండు, పత్తి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ను నియమించాలి
Published Thu, Feb 26 2015 12:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement