మలేసియాలో గార యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

మలేసియాలో గార యువకుడి మృతి

Published Mon, Mar 9 2015 1:50 AM

gara young man died in Malaysia

 గార: మండలంలోని తోనంగికి చెందిన నేతింటి సీతారాం (21) మలేసియాలో జరిగిన వేగ్ (ఓడ) ప్రమాదంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. సీతారం సీమెన్ శిక్షణ కోసం మూడు మాసాలు క్రితం మలేసియాలోని ప్రయివేటు పరిశ్రమలో  చేరాడు. వేగ్‌లో జరిగే ప్రమాదంలో మృతి చెందినట్టు సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రులు రామారావు, తవిటమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందివచ్చిన కొడుకు ఇలా మృతి చెందుతాడని బోరుమంటున్నారు. అయితే ఎప్పుడు చనిపోయాడు అనేది సమాచారం లేదు.
 

Advertisement
Advertisement