నెల్లూరుసిటీ : ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చేందుకు ఓ కసాయి కూతురు హత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటనలో గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం నగరంలోని నవాబుపేట ఎఫ్సీఐ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎఫ్సీఐ కాలనీలోని షాదీమంజిల్ సమీపంలో రావిళ్ల సుబ్బమ్మ (75) నివసిస్తుంది.
భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి జయమ్మ, బుజ్జమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరందరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. చిన్న కుమార్తె బుజ్జమ్మ ఆర్థికంగా స్థిరపడింది. పెద్ద కుమార్తె జయమ్మ భర్త 7 ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.
వీళ్లందరూ 6 పోర్షన్లు ఉన్న ఇంట్లో ఉంటున్నారు. జయమ్మ తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు తల్లి భాగం పోర్షన్ కూడా రాసివ్వాలని పలుమార్లు డిమాండ్ చేసేది. దీంతో తల్లి, కూతురు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా వీరి మధ్య గొడవ తారా స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయం చూసి తల్లి సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్లిన జయమ్మ రోకలి బండతో తల్లి తలపై కొట్టింది.
దీంతో సుబ్బమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఉదయం 6.30 గంటల సమయంలో స్థానికుడైన ఓ వ్యక్తి గుడికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు ముందుకు వేసి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూశాడు. సుబ్బమ్మ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి చిన్న కూతురు బుజ్జమ్మకు సమాచారం అందించాడు.
దీంతో హుటాహుటిన స్థానికుల సహాయంతో 108లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే మృతురాలి చెవి కమ్మలు సైతం మాయమయ్యాయి. నిందితురాలే చెవి బంగారు కమ్మలు దొంగిలించి ఉంటుందని తెలుస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్చార్జ్ సీఐగా వ్యవహరిస్తున్న మంగారావు కేసు దర్యాప్త చేస్తున్నారు. ఘాతుకానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
ఆస్తి కోసం ఘాతుకం
Published Tue, Nov 25 2014 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement