క్షుద్రపూజల పేరుతో బాలికను బలిచ్చే యత్నం | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజల పేరుతో బాలికను బలిచ్చే యత్నం

Published Sun, May 22 2016 11:25 AM

girl rescued by police some people false prays

రాజమండ్రి: మూఢ నమ్మకాల ముసుగులో ఓ ఐదేళ్ల బాలికను కొందరు అన్యాయంగా బలి తీసుకునే ప్రయత్నం చేశారు. రాజమండ్రి సైక్లోన్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆరుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తూ బాలికను బలిచ్చేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను కాపాడి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement