కేసముద్రం: గణతంత్ర వేడుకలకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో భరతమాత వేషధారణతో కనిపించాలనుకున్న ఆ విద్యార్థిని కోరిక విషాదానికి దారితీసింది. వేషధారణకు అవసరమైన కొత్త దుస్తులు, పట్టీలు తండ్రి తీసుకరాకపోవడంతో మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు పిల్లగుండ్ల తండాలో శనివారం జరిగింది.
ఎస్సై అబ్దుల్ రహమాన్ తెలిపిన ప్రకారం...తండాకు చెందిన గుగులోతు లచ్చు, హమాలీ దంపతులకు కుమార్తెలు మనీషా, అనూష, శిరీష ఉన్నారు. మనీషా పదో తరగతి, అనూష (12)స్థానిక యూపీఎస్లో ఏడో తరగతి చదువుతున్నారు. ఎంతో చురుగ్గా ఉండడే అనూష పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఆ సంతోషంలో ఉన్న అనూష కొత్త దుస్తులు, పట్టీలతో వెళ్లి రిపబ్లిక్ డే రోజు భరతమాత వేషం ధరించాలని ఆశపడింది.
ఈ క్రమంలోనే ఆమె శుక్రవారం కేసముద్రం మార్కెట్కు తమ చేలో పండిన పత్తి అమ్మడానికి వెళ్తున్న తండ్రితో ‘నాన్నా నాకు పట్టీలు, లంగా ఓణీ తీసుకురా’ అని కోరింది. అరుుతే పత్తి అమ్మగా వచ్చిన డబ్బులతో చేసిన అప్పు తీరేటట్లు లేదన్న బాధతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తండ్రితో పట్టీలు, డ్రెస్సు కావాలంటూ అనూష మారం చేసింది. శనివారం ఉదయం కూడా మళ్లీ అడిగింది. దీంతో తల్లి ఆమెను సంతోషపెట్టాలనుకుంది.
మార్కెట్కు వెళ్లి గాజులు, చెప్పులు కొనుక్కొచ్చి కూతురుకు ఇచ్చింది. అనంతరం అప్పు చెల్లించేందుకు తండ్రి, చేను వద్దకు తల్లి వెళ్లిపోయారు. అయితే మనోవేదనతో ఉన్న అనూష తల్లి తెచ్చిన గాజులు తొడుక్కుని, చెప్పులు వేసుకుని ఇంట్లో దూలానికి ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు హతాశులై కుప్పకూలారు. గుండెలవిసేలా కూతురు కోసం రోదించారు.
పట్టీలు కొనివ్వలేదని.. ప్రాణాలు తీసుకుంది
Published Sun, Jan 26 2014 9:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement