అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలు ఇవ్వండి | Sakshi
Sakshi News home page

అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలు ఇవ్వండి

Published Tue, Nov 22 2016 1:40 AM

Give Akshaya Gold assets

ఏపీ సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఓ కొలిక్కి తెచ్చిన ఉమ్మడి హైకోర్టు ఇప్పుడు అక్షయగోల్డ్‌పై దృష్టి సారించింది. దానికి చెందిన ఆస్తుల వివరాలను తమ ముందుంచాలని సోమవారం ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తనఖాలో ఉన్నవి, తనఖా లేకుండా తక్షణ విక్రయానికి వీలుగా ఉన్న ఆస్తులు.. తదితర వివరాలను సమర్పించాలంది.

వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ కేసు తరహాలో అక్షయగోల్డ్ ఆస్తులను వేలం వేసే ప్రణాళికలు రూపొందిస్తామంది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement