ప్రత్తిపాడు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ సమావేశంలో ప్రసంగిస్తున్న బోస్
ప్రత్తిపాడు : కార్యకర్తలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, గ్రామ స్థాయి నుంచీ పార్టీని పటిష్ట పరచాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యు డు, మాజీ మంత్రి పిల్లి సుబాష్చంద్రబోస్ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలోని రవివర్మ మామిడి తోటలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజా వ్యతిరేక చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు డ్రామా లు ఆడుతున్నారని విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ పోస్టు ఇవ్వడానికీ టీడీపీ నాయకులు సిగ్గులేకుండా లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. మాజీ జెడ్పీచైర్మన్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బిడ్డ గర్బంలో పడిన నాటి నుంచీ వారి సంక్షేమం కోసం పాటుపడడం మనస్సున్న మారాజు రాజశేఖరునికే సాధ్యపడిందన్నారు. పార్టీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దొంగ రామసత్యనారాయణ, అలమండ చలమయ్య తదితరులు ప్రసంగించారు. పార్టీ ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
తొలుత పార్టీ నాయకులకు బుద్దరాజు గోపీరాజు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ్భాస్కర్, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, మాకినీడు గాంధీ, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి జడ్పీటీసీ సభ్యులులు ముదునూరి లోవలక్ష్మి, జ్యోతుల పెదబాబు, చెన్నాడ సత్తిబాబు, సర్పంచ్లు ముచ్చర్ల నాగలక్ష్మి, యాళ్ల విశ్వేశ్వరరావు, సొసై టీ అధ్యక్షుడు జువ్వల చినబాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలకు సన్మానం
అనంతరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరిలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
ఫొటోరైటప్ :29జెపిటి61-27020002: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న పిల్లి సుబాష్ చంద్రబోస్. 29జెపిటి62-27020002: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు వరుపుల, దాడిశెట్టి, వంతల రాజేశ్వరిలను సత్కరిస్తున్న దృశ్యం.
కార్యకర్తలకు అండగా ఉంటాం
Published Mon, Sep 29 2014 11:54 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement