అడ్డాకుల, న్యూస్లైన్: వంశోద్ధారకుడు పుట్టినందుకు సంతోషించాలో.. లేక కడుపు బయట అవయవాలు అంటిపెట్టుకుని పుట్టిన కొడుకును చూసి బాధపడాలో తెలియక ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. కొడుకు పుట్టినప్పుడు పొట్ట దిగువభాగానికి అంటిపెట్టుకుని చిన్న కణితి మాదిరిగా ఉన్న అవయవాలు బాబు పెరిగేకొద్దీ పెరుగుతున్నాయి. కొడుకుకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివరాల్లోకెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా ఖిల్లాఘణపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన నాగయ్య, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర క్రితం బాలుడు పుట్టాడు. తొలకాన్పులోనే కొడుకు పుట్టాడని ఆంజనేయులు అని పేరు పెట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పుట్టుకతోనే బాలుడి కడుపులో ఉండాల్సిన అవయవాలు కొన్ని చిన్న కణితి మాదిరిగా పొట్ట భాగాన్ని అంటిపెట్టుకుని పూర్తి బయట పెరిగాయి. బాలుడిని మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రితో పాటు హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులకు చూపించారు. అలాగే హైదరాబాద్లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చూపించి ఇప్పటివరకు సుమారు లక్షరూపాయల వరకు ఖర్చుచేశారు. అయినా సరైన వైద్యం చేయలేకపోయారు. ఆంజనేయులుకు ఆపరేషన్ చేయడానికి వైద్యులు వెనకడుగు వేస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే వయసుతో పాటు అవయవాల కణితి కూడా రోజురోజుకు పెరిగి పెద్దదవుతోంది. బాలుడు లేచి నిలబడలేని విధంగా మారింది.
బాలుడిని ఎత్తుకోవాలంటే కణితిని ప్రత్యేకంగా పట్టుకోవాల్సి ఉంటుంది. చిన్నారి పొట్టపై పెరిగిన అవయవాలను ఆపరేషన్ ద్వారా కడుపులోపల అమర్చవచ్చని వైద్యులు చెప్పినట్లు బాలుడి తల్లి లక్ష్మి తెలిపింది. ఈ అరుదైన వైద్యం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే సాధ్యమవుతుందని, లక్షన్నర రూపాయలు మేర ఖర్చువుతాయని ఇంతకుముందుకు చూసిన వైద్యులు తెలిపారని ఆమె పేర్కొంది. అంతమొత్తంలో ఖర్చుచేసే స్థోమత లేకపోవడంతో, తన కొడుక్కి ఏమవుతుందోనని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. దేవుడా నీవే దిక్కు..అంటూ దేవుడిపైనే భారం వేసింది.
దేవుడా నీవే దిక్కు!
Published Sat, Aug 31 2013 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement