పుష్కర ప్రారంభం జూన్ 28నే | Sakshi
Sakshi News home page

పుష్కర ప్రారంభం జూన్ 28నే

Published Thu, Aug 28 2014 5:34 PM

పుష్కర ప్రారంభం జూన్ 28నే

రాజమండ్రి కల్చరల్: గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 28నే ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిషవిద్వాంసుడు మధుర కృష్ణమూర్తి శాస్త్రి స్పష్టం చేశారు. రాజమండ్రి బ్రౌన్ మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి సంకలనం చేసిన జై గణేశ వ్యాససంపుటిని  మధుర కృష్ణమూర్తి శాస్త్రి  బుధవారం స్థానిక కృష్ణనగర్‌లోని విశ్వ విజ్ఞాన ప్రతిష్ఠానం కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పండుగలలో ఏకీకరణను సాధించడానికి 1953-56 మధ్యలో నియమించిన క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ నిర్వాకం వల్లే పుష్కరాల తేదీలు, ఇతర పర్వదినాల గణన విషయంలో అయోమయం ఎదురవుతున్నదని  అభిప్రాయపడ్డారు.  గోదావరి పుష్కరాలు కచ్చితంగా 2015 జూన్ 28 ఉదయం 8.27 గంటలకు ప్రారంభమవుతాయని, తాము దీనినే అనుసరిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement