గాంధారి, న్యూస్లైన్ : పేదల సంక్షేమం కోసం పాటు పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మం త్రి సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గత కాంగ్రేసేతర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. జి ల్లాలో గృహనిర్మాణాల కోసం రూ. 500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో 119 మంది ఆడ పిల్లలు బంగారు పథకంలో చేరారని, వారి పేర్లపై బ్యాంకుల్లో ఒక్కొక్కరికి రూ. 42 వేలు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. కొత్తగా 1,353 మందికి రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుతో కామారెడ్డి డివిజన్ సస్యశ్యామలంగా మారుతుందన్నారు.
తాగడానికి గోదావరి జలాలు: సురేష్ శెట్కార్, ఎంపీ
మండలంలో గిరిజనులు అధికంగా ఉన్నారని, మారుమూల గ్రామాలు, తండాలు వెనుకబడి ఉన్నాయన్నారు. తాగు నీటి ఎద్దడి అధికంగా ఉందని, ఈ సమస్య పరిష్కారం కోసం గోదావరి జలాలను సరఫరా చేయడానికి రూ.16 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు.
ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు: ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి
అందకు ముందు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు ప్రచారం ఎక్కువ పని తక్కువ అని విమర్శించారు. పింఛన్లు, గృహ నిర్మాణాల కోసం వేలల్లో దరఖాస్తులు వస్తే, రేషను కార్డులు, పింఛన్లు నామమాత్రంగా మంజూరు చేశారని ఆరోపించారు. ఇళ్లు నిర్మించుకున్నవారు బిల్లులు రాక అధికారులు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Published Thu, Nov 14 2013 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement