చీరాల, న్యూస్లైన్: ‘భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన పొలాల రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతులకు సబ్సిడీతో కూడిన వరి, శనగ విత్తనాలందిస్తాం.’ ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా పర్చూరులో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చెప్పిన మాటలివి. సబ్సిడీ విత్తనాలు ఇస్తామన్న కిరణ్కుమార్రెడ్డి సాగు సమయం మించిపోతున్నా వాటి ఊసే మరిచిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తామని చెప్పగా వ్యవసాయాధికారులు మాత్రం అటువంటి విత్తనం వచ్చే అవకాశం లేదనడం చూస్తే ప్రభుత్వానికి రైతులపై ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొమ్మమూరు ఆయకట్టు కింద ఉన్న కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో వేసిన వరి ముంపునకు గురై పనికి రాకుండా పోయింది. కొమ్మమూరు ఆయకట్టు కింద లక్ష ఎకరాల్లో వరి సాగవుతుంది. మామూలుగా 92 రకం వరి పైరును సాగు చేస్తారు. అకాల వర్షాలకు ముంపునకు గురై, సాగుకు సమయం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులకు ఎన్ఎల్ఆర్ 145 రకం వరి విత్తనాలను అందించాలని వ్యవసాయాధికారులు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రిని పర్చూరులో జరిగిన సమీక్ష సమావేశంలో కోరారు. వెంటనే సీఎం ఎన్ఎల్ఆర్ 145 రకం విత్తనాలు నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, అక్కడ నుంచి తెప్పించి రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి రెండు వారాలు గడుస్తున్నా ఎన్ఎల్ఆర్ 145 విత్తనం జిల్లాకు రాలేదు. అలానే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఈ విత్తనం అందుబాటులో లేదని వ్యవసాయాధికారులంటున్నారు.
ఈ విత్తనం వచ్చే అవకాశం కూడా లేదని తేలింది. అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు రైతులకు అందే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే నవంబర్ కూడా రావడంతో వరి సాగు చేసే సమయం మించిపోతోంది. ప్రస్తుతం ఆ విత్తనం వచ్చినప్పటికీ రైతులకు ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి 10010 అనే రకం విత్తనాన్ని 30 కేజీల బస్తా రూ 1200 చొప్పున కొనుగోలు చేసి నార్లు పోశారు.
ఎన్ఎల్ఆర్ 145తో మేలు...
ఎన్ఎల్ఆర్ 145 రకం వరి విత్తనం సాగుకు అనుకూలంగా ఉంటుంది. 145 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ముఖ్యంగా పైర్లకు తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే 10010 రకానికి అయితే తెగుళ్లు అధికంగా ఆశిస్తాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండదు.
ఏడీఏ ఏమంటున్నారంటే...
‘ఈ ప్రాంతంలో ఎన్ఎల్ఆర్ 145 రకం విత్తనం సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నివేదించాం. కానీ నెల్లూరు జిల్లాలో కూడా ఆ విత్తనం అందుబాటులో లేదు. రైతులు ప్రస్తుతం వేస్తున్న 10010 రకం విత్తనాలకు తెగుళ్లు అధికంగా ఆశించే అవకాశం ఉంది. రైతులు ఎన్ఎల్ఆర్ 145 బదులుగా ఎన్ఎల్ఆర్ 344499 రకాన్ని సాగు చేయడం మంచిది’ అని ఏడీఏ మస్తానమ్మ తెలిపారు.
వట్టిదే..!
Published Sun, Nov 10 2013 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement