కరీంనగర్: మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఆస్పత్రిలో రోగుల కేస్ షీట్లు మారిపోతుంటే, మరో ఆస్పత్రిలో గర్భిణీలను బయటకు గెంటివేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఈ నెల 15 రాత్రి 10 గంటల సమయంలో 108 అంబులెన్స్లలో కామారెడ్డి పట్టణానికి చెందిన సీహెచ్ రాధ అనే గర్భిణిని తీసుకు వచ్చారు. భిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ పరిధిలోని, అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన వరాల్ల రేణుక పురిటి నొప్పులతో వచ్చింది. వీరిని చూసిన వెంటనే నర్సులు ఇక్కడ మత్తు మందు డాక్టర్ లేరు, నిజామాబాద్ ఆస్పత్రికి రాసిస్తాం అక్కడికి వెళ్లండని చెప్పారు. గర్భిణుల భర్తలు సతీష్, బాల్రాజు, బంధువులు కలిసి నర్సులను గట్టిగా నిలదీశారు. దాంతో వారందరిని బయటకు గెంటి వేశారు. చేసేదేమి లేక రాధను బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రేణుకు మా త్రం అక్కడి నుంచి వెళ్లక పోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
రెండు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్షీట్ను మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించని రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారు. ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈరోజు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఓ గర్భిణీని బయటకు గెంటివేసింది. ప్రసవం కోసం ఒక గర్భిణీని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది బయటకు గెంటివేయడంతో బంధువులు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం వల్ల, దురుసుగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకునేవారు లేనందున రోజురోజుకు సిబ్బంది అరాచక చర్యలు పెగిరిపోతున్నాయని రోగులు, బంధువులు వాపోతున్నారు.
ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ బయటకు గెంటివేత
Published Sat, Nov 23 2013 2:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement