- అంబేడ్కర్ వర్సిటీ సేవలు నిలిపివేతపై ఆందోళన
- విద్యార్థులు ఉద్యమం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
- వర్సిటీ రీజనల్ జేడీ సీహెచ్ ప్రసాద్
గుంటూరు ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ సేవలు కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని కోరుతూ వర్సిటీ రిజిస్ట్రార్ ఏపీ ప్రభుత్వానికి నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందించకపోవడంతో వారు సేవలను నిలిపివేశారని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని వర్సిటీ విజయవాడ ప్రాంతీయ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ చాముండేశ్వరి ప్రసాద్ అన్నారు. జేకేసీ కళాశాలోని బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో శుక్రవారం వర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జేడీ చాముండేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలోని 13 జిల్లాల్లో 92 అధ్యయన కేంద్రాలు, ఏడు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల ద్వారా అంబేడ్కర్ వర్శిటీపై ఆధారపడి 3.50 లక్షల మంది అభ్యర్థులు డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారని చెప్పారు. రెండు నెలల క్రితం ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఉద్యమబాట పట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆరోపించారు. వర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ పి.గోపీచంద్ మాట్లాడుతూ దూర విద్యా వ్యాప్తి లక్ష్యంతో ఎన్టీఆర్ స్ధాపించిన అంబేడ్కర్ వర్సిటీలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. దీనిపై గవర్నర్, సీఎం, విద్యాశాఖ మంత్రికి పోస్ట్కార్డులు పంపుతామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
Published Sat, Aug 1 2015 4:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement