సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. కిందిస్థాయి నుంచి ఆర్డీవో స్థాయి వరకూ రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్లను తీర్చాలని మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సోమవారం రాష్ట్ర భూపరిపాలన కార్యాలయంలో జరిగిన సమీక్షలో పలు అంశాలపై మంత్రి, ఉన్నతాధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భక్తవత్సలనాయుడు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు గోపాల్రావు తదితరులతో కలిసి వెంకటేశ్వర్లు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వీఆర్వోల వేతనం పెంచేందుకు అంగీకరించి ఫైలును ఇప్పటికే ఆర్థికశాఖకు పంపించారు. వీఆర్ఓలకు డీఏను రూ. వంద నుంచి రూ. 150కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. చనిపోయినవారి వారసులను కారుణ్య నియామకం కింద వీఆర్ఓగా నియమించేందుకు విద్యార్హతను పదో తరగతి కాకుండా ఏడో తరగతికి తగ్గించడంపైనా సానుకూలత తెలిపారు. వీఆర్ఓ పోస్టుల భర్తీలో వీఆర్ఏలకు ప్రస్తుతమున్న 30 శాతం కోటాను 50 శాతానికి పెంచేందుకు, వీఆర్ఏలకు చైన్మెన్గా పదోన్నతి కల్పించేందుకు, మహిళా వీఆర్ఏలకు 120 రోజుల మెటర్నిటీ లీవు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాల్ని సీజ్ చేసి కోర్టులో సమర్పించే బాధ్యత నుంచి రెవెన్యూ అధికారులను తప్పించాలన్న డిమాండ్కూ సానుకూలత తెలిపారు. ఇత ర శాఖల్లోలాగే 45 ఏళ్లు నిండినవారికి పరీ క్షలో అర్హతతో నిమిత్తం లేకుండా పదోన్నతి కల్పిం చేందుకు ఒప్పుకున్నా రు’’ అని వివరించారు.
రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్లకు ఓకే
Published Tue, Nov 19 2013 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement