జిల్లా పరిషత్తు(జడ్పీ) స్కూళ్లలోని దాదాపు 3 లక్షల మంది టీచర్ల జీపీఎఫ్ రుణాలకు సంబంధించి పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు అధికారాన్ని జిల్లా పరిషత్తు నుంచి స్థానిక ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు పీఆర్టీయూ వెల్లడించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయాల ద్వారా మంజూరు చేస్తున్నందున నెలల తరబడి జాప్యం జరిగి జెడ్పీ స్కూళ్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు.
2002 మే నెలలో జారీ చేసిన జీఓ 40 ప్రకారం జీపీఎఫ్ లోన్స్/పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు చేసే అధికారం స్థానిక ఎంఈఓలకు, హెచ్ఎంలకు కల్పించినా అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, విద్యాశాఖ, ట్రెజరీ ఉన్నతాధికారులు, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి మంగళవారం సమావేశమై దీనిపై చర్చించారు.
జీఓ 40 అమలుకు ఉన్నతాధికారులు సానుకూలత తెలిపి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించారని పీఆర్టీయూ నేతలు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో జీపీఎఫ్ ఖాతాలు సక్రమంగా నిర్వహించాలని, 2013 మార్చి నాటికి పూర్తి చేసి ఆన్లైన్లో పొందుపరచాలని అధికారులను నాగిరెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు.
హెచ్ఎం, ఎంఈఓలకు జీపీఎఫ్ మంజూరు అధికారం!
Published Wed, Sep 11 2013 2:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement