పెనుకొండ :
దసరా పండుగకు మనవళ్లను తనింటికి పిలుపుకుని వెళ్లిన ఆ తాత.. సోమవారం పాఠశాలలను తెరుస్తారని భావించి ద్విచక్ర వాహనంలో చిన్నారుల్ని వారి తల్లిదండ్రులకు వద్దకు తీసుకొస్తుండగా కారు రూపంలో మృత్యువు వెంటాడింది. తాత, ఓ మనవడిని కబలించింది. మరో మనవడు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కారులో ఉన్న బెంగళూరుకు చెందిన మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆదివారం పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యంకు చెందిన బోయ చెన్నప్పకు, కొత్తచెరువు మండలం బైరాపురానికి చెందిన బోయ హనుమంతప్ప కుమార్తె లక్ష్మిదేవితో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారులు చెన్నకేశవులు(11), సాయిప్రసాద్ (10) ఉన్నారు. కుమారులపై ఎంతో మమకారం పెంచుకున్న చెన్నప్ప హమాలీ పని చేసి వారిని పోషిస్తున్నాడు.
తల్లి కూలీ పనులు చేసి వారిని పోషిస్తోంది. వారిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. మండలంలోని వెంకటగిరిపాళ్యంలో చెన్నకేశవులు 6వ తరగతి,సాయిప్రసాద్ 5వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు రావడంతో వారుబైరాపురానికి అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్లారు. సోమవారం పాఠశాలలు తెరుస్తారని భావించిన తాత బోయ హనుమంతప్ప మనవళ్లిదరినీ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంలో వెంకటగిరిపాళ్యంకు బయలుదేరారు. రాంపురం-మరువపల్లి దాటాక వెంకటరెడ్డిపల్లి వద్ద మట్టి రోడ్డు గుండా బైపాస్ రోడ్డు మీదుగా 44వ జాతీయ రహదారిపైకి ద్విచక్ర వాహనంలో చేరుకోబోయారు. ఈ సందర్భంలో అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొంది. హనుమంతప్ప(60) ఎగిరి పడ్డంతో ఆయన కాళ్లు, చేతులు విరిగి పోయాయి. సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చెన్నకేశవులు, సాయిప్రసాద్లను వెంటనే 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తర లించారు. చికిత్స పొందుతూ సాయిప్రసాద్ మరణించాడు. తలకు తీవ్ర గాయాలైన చెన్నకేశవులు పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన బెంగళూరు నిమ్హాన్స్కు తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న బెంగళూరు ఉత్తరహళ్ళికి చెందిన రాజేష్ భార్య అరుణ, కుమార్తె మయూరకు గాయాలయ్యాయి.
రాజేష్తో పాటు వాహనంలో ఉన్న డాక్టర్ దేశ్పాండే, మరో వృద్ధురాలికి గండం తప్పింది. ప్రమాదంలో కారు, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పెనుకొండ ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కుమారులను చూపించాలంటూ అధికారులు, వైద్యుల్ని వేడుకున్నారు. బాధితుల్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మీపైనే అన్ని ఆశలు పెట్టుకుంటే.. భగవంతుడు ఎంత పని చేసాడయ్యా.. అంటూ వారు గుండెలవిసేలా విలపించారు. ఎంపీపీ యశోదమ్మ భర్త కేశవయ్య, జెడ్పీటీసీ నారాయణస్వామి, లక్ష్మినారాయణరెడ్డి, సూర్యనారాయణ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల్ని ఓదార్చారు. వారికి సహా యం అందించారు. వెంకటగిరిపాళ్యం, బైరాపురం గ్రామాల ప్రజ లు భారీగా తరలివచ్చారు.చెన్నకేశవులు వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు.
తాత, మనవడిని కబళించిన మృత్యువు
Published Mon, Oct 6 2014 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కలసిన చేతులు.. కలవని మనసులు
యువత.. నవ జనత
శిక్షణలో నేర్పించే అంశాలు
విధులకు హాజరు కాకపోతే క్రమశిక్షణ చర్యలు
3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ
ఓటర్ల చైతన్యంతో ప్రజాస్వామ్యం బలోపేతం
ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కృష్ణావర్సిటీలో శరవేగంగా భవనాల నిర్మాణ పనులు
చల్లబడ్డ వాతావరణం
యువత.. నవ జనత
తప్పక చదవండి
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
Advertisement