పశువుల వ్యాపారి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పశువుల వ్యాపారి ఆత్మహత్య

Published Fri, Aug 21 2015 6:25 PM

grazier commits suicide

యాడికి (అనంతపురం) : పురుగులమందు తాగి పశువుల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని చెక్‌డ్యాం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన చింతకుంట శీనయ్య(60) పశువుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన శవమై కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement