సాక్షి ప్రతినిధి, కడప:
ఒక పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ‘ఏ' ఫారం పంపితే, జిల్లా అధ్యక్షుడు ‘బి' ఫారం జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న వెసులుబాటు. ఆ మేరకు ఎన్నికల్లో నిబంధనలు వర్తిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలన అలాగే ఉంది. పింఛన్ కమిటీలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీకి ఉన్న వెసులుబాటును ఇన్ఛార్జి మంత్రి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ‘ఏ’ ఫారం అనుకుంటే, నియోజకవర్గ ఇన్ఛార్జులు పేర్లను ‘బి’ ఫారంగా చేర్చారు. వారు చెప్పినట్లుగా కమిటీలో మెంబర్లను నియమిస్తున్నారు. అదే మంటే ఇన్ఛార్జి మంత్రి ఆదేశాలంటూ బుకాయిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల కమిటీల్లో గ్రామ, మండల స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలను నియమించుకుంటూ పచ్చపాలన సాగిస్తున్నారు. ఈ కమిటీలు కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు కాకపోగా ఉన్న పింఛన్లు ఊడగొట్టేందుకే కావడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు, వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసి వారి పాలిట పెద్ద కొడుకుగా నిలిచారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్లలో కోత విధిస్తుండటంతో వృద్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఊడగొట్టేందుకే ప్రాధాన్యత...
జిల్లాలో 1,24,319 వృద్ధాప్య, 65,078 వితంతు, 16,895 అభయహస్తం, 8,813 చేనేత, 30,603 వికలాంగులు, 21 కల్లు గీత కార్మికులకు కలిపి 2,45,729 పింఛన్లు అందుతున్నాయి. వీరి కోసం ప్రభుత్వం రూ.6.951 కోట్లు ప్రతినెలా భరిస్తోంది. అయితే ఆక్టోబర్ 2 నుంచి రూ.1000 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఇంతకాలం పింఛన్ అందుకున్న వృద్ధులు ఆనందించారు. పింఛన్ పొందుతున్నవారు అర్హులా? అనర్హులా అంటూ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పారదర్శకతతో కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అనుచరులకే ప్రాధాన్యతనిస్తున్నారు. పైగా కొత్తగా అర్హులకు పింఛన్లు ఇచ్చేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పింఛన్ దరఖాస్తులు తీసుకునేందుకు మాత్రమే అనుమతించారు. ఉన్న వాటిలో కొన్నింటిని తొలగించి ఆ స్థానంలో కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి ఇవ్వాల్సిన స్థితిని అధికారులకు కల్పిస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని పింఛన్ దారులుగా చేర్చుకునేందుకు ప్రస్తుతం ఉన్న పింఛన్లు కొన్నింటినైనా తొలగించాలి. అందుకోసం కమిటీల్లో తెలుగుతమ్ముళ్లు అధికంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా టీడీపీ రౌడీషీటర్లు సైతం జాబితాలో చేరుతున్నారు.
కమిటీల్లో లోపించిన చిత్తశుద్ధి...
తెలుగుదేశం ప్రభుత్వం ఏపని చేపట్టినా స్వకార్యాన్నే బేరీజు వేస్తోంది. పింఛన్ల కమిటీలో పారదర్శకతకు తిలోదకాలిచ్చింది. గ్రామ స్థాయిలో సామాజిక కార్యకర్తలుగా తెలుగుతమ్ముళ్లు వచ్చి చేరారు. అసాంఘిక శక్తులుగా గుర్తింపు పొందినా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదేశాలు ఉంటే చేరిపోయారు. మండల స్థాయిలో ఇరువురు సర్పంచ్లు, ఇరువురు ఎంపీటీసీలను ఇన్ఛార్జి మంత్రి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నలుగురు లేని చోట ఖాళీగానే అసంపూర్తిగా కమిటీలను నియమిస్తున్నారు. అందుకు కారణం ఎదుటి పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధి జాబితాలో చేరుతారనే ఉద్దేశం అధికార పార్టీకి కన్పిస్తోంది. నలుగుర్ని కూడా మంత్రి సిఫార్సులు లేకపోయినా టీడీపీ ఇన్ఛార్జి సూచించిన వారిని చేరుస్తూ పచ్చపాలన సాగిస్తున్నారు. తెలుగుదేశాధీశుల పాలనలో కొత్తగా పింఛన్లు దక్కకపోగా మరొకరి పింఛన్ ఊడగొట్టి ఇంకొకరికి ఇవ్వాల్సిన దుస్థితి కల్గుతోంది.
‘పచ్చ' పాలన!
Published Wed, Sep 24 2014 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement