గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయాలని రాస్తారోకో | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయాలని రాస్తారోకో

Published Fri, Aug 11 2017 11:12 AM

Group-2 candidates demond cancel the exam

విశాఖపట్నం: గ్రూప్-2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఏయూ లైబ్రరీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
 
పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ జరిగిందంటూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. హైకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని అభ్యర్థులు కోరుతున్నారు.  

Advertisement
Advertisement