- లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాలను సవరించాలి
- ప్రధాని మోదీకి కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ
కిర్లంపూడి (జగ్గంపేట): ఎన్నికల మేనిఫెస్టోలోను, ప్రచారంలోను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు అమలు చేసేవిధంగా నిబంధన విధించాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఒకవేళ ఆ హామీలు అమలు చేయకపోతే కఠినచర్యలు తీసుకునేందుకు చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకర్లకు విడుదల చేశారు.
అధికారం చేపట్టేందుకు అమాయక ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుంటున్నారని, హామీలు అమలు చేయాలని అడిగితే ప్రజలను పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడంలాంటివి చేసి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. హామీలపై ఉన్నతస్థాయిలో నియంత్రణ లేకపోవడంతో నాయకులు అధికారం కోసం అబద్ధాలు చెప్పడానికి వెనుకాడటంలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను పదవీకాలం ముగిసేసరికి తూతూమంత్రంగా అమలు చేసి అన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, ఇలాంటివారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అధికారం చేపట్టేందుకు అమాయక ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుంటున్నారని, హామీలు అమలు చేయాలని అడిగితే ప్రజలను పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడంలాంటివి చేసి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. హామీలపై ఉన్నతస్థాయిలో నియంత్రణ లేకపోవడంతో నాయకులు అధికారం కోసం అబద్ధాలు చెప్పడానికి వెనుకాడటంలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను పదవీకాలం ముగిసేసరికి తూతూమంత్రంగా అమలు చేసి అన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, ఇలాంటివారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.