► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
► గుంటూరులో ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాలు
పట్నంబజారు(గుంటూరు): దేశంలోని అన్ని కులాలు, మతాలు, జాతుల ఉమ్మడి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచిన అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడని కొనియాడారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. లాడ్జిసెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీళ్లతో శుభ్రం చేశారు. అనంతరం స్వయంగా చీపురు చేపట్టి ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు.
అంబేడ్కర్ ఆశయాన్ని అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. పార్టీ నేతలు పానుగంటి చైతన్య, పేటేటీ నవీన్బాజీ, వినోద్, విఠల్, రబ్బాని, నరాలశెట్టి అర్జున్ నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, కొత్తాచిన్నపరెడ్డి, జగన్కోటి, గనిక ఝాన్సీరాణి, యరమాల విజయకిషోర్, దేవరాజ్, మేరువ నర్సిరెడ్డి, మేళం ఆనందభాస్కర్,త దితరులు పాల్గొన్నారు. కోబాల్డ్పేటలో అంబేద్కర్ విగ్రహానికి అప్పిరెడ్డి స్వయంగా రంగులు వేశారు.
వార్డు నేతలు జగన్కోటి, షేక్ సైదా, రాజు, రంజుల శ్రీనివాస్, మేళం ఆనందభాస్కర్, తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కేవీపీ కాలనీలోని జోసఫ్నగర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి జయంతి వారోత్సవాలు నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు కొండారెడ్డి నాగేశ్వరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడు
Published Sat, Apr 9 2016 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement