సాక్షి, గుంటూరు: కంచే చేను మేసిన చందంగా రక్షణగా నిలవాల్సిన పోలీసులే బాధితుల సొమ్ము నొక్కేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా దొంగలతో దోస్తీ చేస్తున్నారు. దొంగలు దోచుకుపోయారంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న పౌరులకు రిక్త హస్తం చూపుతున్నారు. అవినీతి పోలీసు అధికారుల బండారాలు జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, బంగారం రికవరీ కేసులో పోలీసులే రూ. 50 వేలు లంచం తీసుకుని నిందితుడిని వదిలేసిన సంఘటన బయట పడింది.
పాత గుంటూరు అంబేద్కర్ నగర్కు చెందిన బొర్రా వీరేశ్వరరావు అనే పత్తి కంపెనీ కూలీ ఇంట్లో 2013 మార్చిలో దొంగతనం జరిగింది. సుమారు 70 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు లబోదిబోమంటూ పాతగుంటూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నంబరు 67/2014తో కేసు నమోదు చేశారు.
ఇది జరిగిన పది రోజుల వ్యవధిలో పెదకాకాని పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా పాతగుంటూరులో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో దొంగను అప్పగించడంతో పాతగుంటూరు పోలీసులు విచారణ చేపట్టారు. అంబేద్కర్నగర్లో దొంగిలించిన బంగారాన్ని గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తికి విక్రయించినట్టు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో శ్రీనివాసరావు పరారయ్యాడు. దీంతో పోలీసులు దొంగను మాత్రమే కోర్టులో హాజరుపర్చారు.
ఆ తరువాత రెండు నెలలకు శ్రీనివాసరావును పట్టుకున్న పోలీసులు బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు లంచం తీసుకుని వదిలేశారు. ఈ కేసులో బాధితుడు బొర్రా వీరేశ్వరరావు రెండు రోజుల క్రితం అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్ను కలవడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు శ్రీనివాసరావును కలవడంతో తన వద్ద రూ. 50 వేలు కాజేసి తిరిగి బంగారం అడగడమేంటని, ఇలాగైతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆత్మరక్షణలో పడ్డ ఓ సీఐ పంచాయితీ పెట్టి బాధితుని బంగారం వెనక్కు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఎస్పీ రాజేష్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇలాంటి సంఘటనలు తన దృష్టికి వచ్చాయని విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మొన్న ఎస్ఐ, నిన్న డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నేడు మరో సీఐ..
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసిన సంఘటనలు వరుసగా మూడు వెలుగులోకి వచ్చాయి. మొన్న గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా తన వద్ద ఓ ఎస్ఐ 200 గ్రాముల బంగారం రికవరీ చేసి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే దొరికినట్టు చూపారని చెప్పాడు. విచారించగా అది నిజమని తేలింది. ఆ ఎస్ఐ అర్బన్ పరిధిలో ఉండటంతో అవాక్కైన సీసీఎస్ పోలీసులు అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్కు సమాచారం ఇచ్చారు.
మరో సంఘటనలో.. ఓ కేసులో దొంగను పట్టుకుని డీఎస్పీ, ఇద్దరు సీఐలు విచారించగా 250 గ్రాముల బంగారం రికవరీ అయింది. అయితే వీరు ముగ్గురూ కూడబలుక్కుని ఆ బంగారాన్ని నొక్కేశారు. ఇటీవల కాకినాడ సీసీఎస్ పోలీసులకు దొరికిన ఆ దొంగ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అదికాస్తా అర్బన్ ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీనిపైన ఆయన విచారణకు ఆదేశించారు.
తాజాగా పాతగుంటూరు పోలీస్స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమిటంటే ఈ మూడు సంఘటనలూ పాతగుంటూరు పోలీస్టేషన్తో సంబంధం ఉన్న కేసులు కావడం గమనార్హం.
అవినీతి పోలీసుల చేతివాటం..!
Published Tue, Jan 13 2015 1:24 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement