సాక్షి, హైదరాబాద్: రద్దీ రోజుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ ఇలా వ్యాపారం చేస్తే ఎలా?’ అంటూ నిలదీసింది. ‘రైళ్లలో కూడా ప్రయాణికులు వెళుతున్నారు. రైల్వేశాఖ అధిక చార్జీలు వసూలు చేయడం లేదు కదా’ అని వ్యాఖ్యానించింది. ఎందుకు అధిక చార్జీలను వసూలు చేయాల్సి వస్తుందో తెలుపుతూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానుల ధర్మాసనం ఆదేశించింది.
పండుగలు, ఇతర పర్వదినాలు, వేసవి సెలవుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి దాదాపు 150 శాతం అధికంగా చార్జీలను ఆర్టీసీ వసూలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన రామరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దానిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజల నుంచి అధిక మొత్తాలను వసూలు చేసుకునేందుకు ప్రభుత్వమే ఆర్టీసీకి అనుమతినిచ్చిందని, ఆ మేర 2003లోనే జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆర్టీసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వం అనుమతించినందునే అధిక చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. రోజూ వారి బస్సులకు తాము అధిక చార్జీలను వసూలు చేయడం లేదని, పండుగ లు, సెలవు దినాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పా టు చేసే ప్రత్యేక బస్సుల్లోనే అధిక చార్జీలను వసూలు చేస్తున్నామని వివరించారు. దానిపై సంతృప్తి చెందని ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.
ఈ అధిక చార్జీల బాదుడేంటి?
Published Tue, Oct 22 2013 6:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement