విషం తాగి హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

విషం తాగి హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

Published Fri, Jan 22 2016 5:38 PM

Head constable commits suicide

గుంటూరు : గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో విషం తాగి బి.వెంకట్ రెడ్డి(55) అనే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంకట్ రెడ్డిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది విషం తాగి ఉంటాడని తోటి ఉద్యోగులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement