రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

Published Mon, Dec 21 2015 10:31 AM

head constable dead in road accident at nellore district

సైదాపురం: నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. కండలేరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హజరతయ్య గూడురు నుంచి డ్యూటీ నిమిత్తం బైక్‌పై వెళుతుండగా టిప్పర్ ఢీకొంది.

దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తలుపూరు-మణిచేడు మార్గం మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

Advertisement
Advertisement